News November 20, 2025

మందుబాబులకు.. ప్రకాశం పోలీస్ డిఫరెంట్ కౌన్సిలింగ్!

image

టంగుటూరు లోని రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతూ చెత్తాచెదారం పోగుచేసిన పలువురికి పోలీసులు భిన్న రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. పలువురు రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతుండగా ఎస్సై నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గతంలో ఇదే ప్రదేశాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు క్లీన్ చేశారు. మందుబాబులు అదే ప్రదేశంలో చెత్త వేయడంతో వారి చేతనే పోలీసులు క్లీన్ చేయించారు.

Similar News

News March 5, 2026

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం..

image

ప్రకాశం(D)లో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. V.Vపాలెం (M) పోలినేనిపాలెంకి చెందిన పాపారావు తన కుమారుడు శ్రీకాంత్‌తో కలిసి విప్పగుంట పొలాల్లో గొర్రెలు మేపుతున్నారు. కోనేరుకుంట వద్ద అన్నం తిని మంచినీటి కోసం శ్రీకాంత్ బావిలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. కుమారుడిని రక్షించేందుకు బావిలోకి దిగిన తండ్రి పాపారావు కూడా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. తండ్రీ కొడుకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

News March 5, 2026

CS.పురం PSలో మొక్క నాటిన SP

image

మార్కాపురం జిల్లా చంద్రశేఖరాపురం మండల కేంద్రం పోలీస్ స్టేషన్‌ను జిల్లా SP హర్షవర్ధన్ రాజు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణను పరిశీలించి తగు సూచనలు చేశారు. బిల్డింగ్ కేసులు వివరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యలు CI మాకినేని శ్రీనివాసరావు, వెంకటేశ్వర నాయక్‌తో చర్చించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.

News March 4, 2026

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

చీమకుర్తి (M)లో బుధవారం దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బూదవాడలోని గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలో ఇద్దరు రాజస్థాన్ కార్మికుల మధ్య జరిగిన ఆర్థిక వివాదం హత్యకు దారి తీసింది. హత్యకు గురైన వ్యక్తి ఓం ప్రకాశ్ (35)గా గుర్తించారు. హత్య చేసిన వ్యక్తిని చీమకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రూ.2వేల కోసం ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.