News November 20, 2025
అరబికా పార్చిమెంట్ కిలో రూ.450: జీసీసీ ఛైర్మన్

పాడేరు: కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పాడేరులోని ఆయన కార్యాలయంలో మాట్లాడారు. గిరిజన సహకార సంస్థ ద్వారా కాఫీ కొనుగోలుకు ధరను అధికారికంగా ప్రకటించామన్నారు. 2025–2026 కాఫీ కొనుగోలు ధర అరబికా పార్చిమెంట్ కిలో రూ.450, అరబికా చెర్రీ కిలో రూ.270, రోబస్టా చెర్రీ కిలో రూ.170గా నిర్ణయించినట్లు చెప్పారు.
Similar News
News March 24, 2026
సిద్దిపేట: వేర్వేరు కారణాలతో ఇద్దరు యువకుల సూసైడ్

సిద్దిపేట జిల్లాలో వేర్వేరు కారణాలతో ఇద్దరు యువకులు సూసైడ్ చేసుకున్నారు. వర్గల్కు చెందిన కరుణాకర్ గౌడ్(36) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వర్గల్(M) నెమ్టూర్కు చెందిన <<19467591>>అశోక్<<>>(34) కుటుంబ తగాదాలతో నేపథ్యంలో మనస్తాపంతో ఉరేసుకున్నాడు.
News March 24, 2026
IPL నుంచి తప్పుకున్న ENG బ్యాటర్!

IPL-2026 నుంచి ENG బ్యాటర్ బెన్ డకెట్(DC) తప్పుకున్నట్లు CricBuzz వెల్లడించింది. ఇంటర్నేషనల్ కెరీర్పై ఫోకస్ చేసేందుకు ఆయన IPLను స్కిప్ చేస్తున్నట్లు సమాచారం. BCCI రూల్ ప్రకారం ఆయనపై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. ఆక్షన్లో ఎంపికైన తర్వాత టోర్నీ నుంచి తప్పుకునే ప్లేయర్లను బ్యాన్ చేయాలని గతేడాది కొత్త రూల్ను తీసుకొచ్చారు. అటు CSKలోకి నాథన్ ఎల్లిస్ స్థానంలో AUS పేసర్ స్పెన్సర్ జాన్సన్ రానున్నారు.
News March 24, 2026
రాపూరు వస్తే.. అవకాశం ఎవరికి..!

కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో నెల్లూరు జిల్లాలో మరలా ఊహగానాలు మొదలయ్యాయి. 1952లో ఏర్పాటైన రాపూరు నియోజకవర్గం డీలిమిటేషన్లో భాగంగా 2008లో ఈ ప్రాంతం శాసనసభ స్థానాల నుంచి తొలగించబడింది. 1952 నుంచి 2004 వరకు జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మరలా రాపూరు నియోజకవర్గాన్ని ప్రకటిస్తే రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది.


