News November 20, 2025

29న పెద్దపల్లిలో సదర్‌ ఉత్సవాలు

image

పెద్దపల్లిలో ఈ నెల 29న సదర్‌ ఉత్సవాలను నిర్వహించనున్నామని ఉత్సవ సమితి పెద్దపల్లి జిల్లా ఛైర్మన్‌ మేకల విజయ్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. బుధవారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాదవుల సంప్రదాయాలను చాటి చెప్పేలా ఈ సదర్‌ ఉత్సవాలను చేపడుతామన్నారు. జిల్లాలోని యాదవ సంఘాల నేతలు, కుల బాంధవులు, యువజన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News March 22, 2026

నేడే రైతు భరోసా నిధుల విడుదల

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. తొలి విడతలో ఒక ఎకరం భూమి వరకు రూ.6,000 చొప్పున మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ₹3,590 కోట్లు చేరనున్నాయి. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా ₹2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు జమ కానున్నాయి.

News March 22, 2026

ఒడిశాలో నంద్యాల జిల్లా వాసి సత్తా

image

భువనేశ్వర్(ఒడిశా)లో ఈనెల 18 నుంచి జరుగుతున్న 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నంద్యాల(D) రుద్రవరం గ్రామానికి చెందిన గౌతమ్ రజత పతకం సాధించారు. ఈ మేరకు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రమణయ్య తెలిపారు. F-41 కేటగిరీ షాట్ పుట్‌లో రజత పతకం సాధించడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని వారన్నారు. జిల్లాలోని ప్రముఖులు గౌతమ్‌కు అభినందనలు తెలిపారు.

News March 22, 2026

నంద్యాల: పొంచి ఉన్న ప్రమాదం!

image

నంద్యాల జిల్లాలో పలు బ్రిడ్జిలు, కల్వర్టుల రక్షణ గోడులు శిథిలావస్థకు చేసుకొని ప్రమాదకరంగా మారాయి. వెలుగోడు మండలం రేగడగూడూరుకు వెళ్లే రహదారిలో అబ్దుల్లాపురం సమీపాన ఉన్న వంకపై ఏర్పాటు చేసిన కల్వర్టుకు సైడ్ వాల్ లేకపోవడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో ఆదమరిస్తే వాహనదారులు ప్రమాదాలకు గురవ్వాల్సిందే. అధికారులు స్పందించి కల్వర్టుపై సైడ్ వాల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.