News April 15, 2024
బంగారం ధర భారీగా పెరగడానికి కారణాలివే!
✒ ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ నిల్వలను అమ్మేసి ముడిచమురు లాంటి అవసరాలను తీర్చుకున్నాయి. ఇప్పుడు అవి మళ్లీ పసిడిని కొంటుండటంతో ధరలు పెరుగుతున్నాయి.
✒ ఈ ఏడాది 40కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ అనిశ్చితి భయాలతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు.
✒ ఈ కారణాల వల్ల 24 క్యారెట్ల 10 గ్రాముల <<13056460>>ధర<<>> రూ.లక్షకు చేరొచ్చని నిపుణుల అంచనా.
Similar News
News October 16, 2024
అద్భుతం: కలలోనూ సమాచార మార్పిడి!
కలగంటున్న ఇద్దరు వ్యక్తులకు సమాచారాన్ని పంపడంలో కాలిఫోర్నియా సైంటిస్టులు విజయం సాధించారు. ‘డెయిలీ మెయిల్’ కథనం ప్రకారం.. నిద్రపోవడానికి ముందు ఇద్దరు అభ్యర్థులకు బ్రెయిన్ను పర్యవేక్షించే పరికరాల్ని పరిశోధకులు అమర్చారు. యంత్రం ద్వారా ఓ పదాన్ని వారికి పంపించగా, నిద్రలోనే పైకి పలికారని వివరించారు. ఇది మానసిక అనారోగ్యాల చికిత్సలో మున్ముందు కీలకంగా మారొచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు.
News October 16, 2024
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోని భక్తులు కూడా అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చని పినరయి విజయన్ సర్కార్ ప్రకటించింది. వర్చువల్ బుకింగ్పై విపక్షాలు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో విజయన్ దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వచ్చిన వారికి కూడా దర్శన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
News October 16, 2024
కమిన్స్ను SRH వదిలేస్తుంది: ఆకాశ్ చోప్రా
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పారు. అతడిపై రూ.18 కోట్లు వెచ్చించేందుకు ఆ జట్టు సిద్ధంగా లేదని చెప్పారు. ‘కమిన్స్తోపాటు మార్క్రమ్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని మాత్రం కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.