News November 20, 2025

ఈ ఉద్యమమే టెక్ శంకర్‌ను మావోయిస్టుగా మార్చింది

image

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో స్వగ్రామం వజ్రపుకొత్తూరు(M)బాతుపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1988లోని పీపుల్స్ ఉద్యమంతో మావోయిస్టుల పార్టీలో చేరి 1995 DEC 1న ఒంగోలు మాజీ MP సుబ్బరామిరెడ్డిపై కాల్పుల కేసులో శంకర్‌ది కీలక పాత్రని సమాచారం. బాతుపురంలో స్తూపం ఆవిష్కరణకు గద్దర్‌ రాకతో రాష్ట్రంలో ఈయన పేరు మార్మోగింది.

Similar News

News March 29, 2026

నరసన్నపేట: సైబర్ మోసం.. బ్యాంకు ఖాతా ఖాళీ

image

సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకున్న యువకుడు ఖాతాలో డబ్బులు మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం నరసన్నపేట మండలం కోమార్తి గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రిందట వాట్సాప్ లో వచ్చిన లింకుని ఓపెన్ చేయడంతో తన ఖాతాలో ఉన్న రూ.52,000 మాయం అయ్యాయని తెలిపాడు. పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.

News March 29, 2026

శ్రీకాకుళం: చికెన్ రూ.400.. గుడ్లు రూ.150

image

శ్రీకాకుళం జిల్లాలో చికెన్ ధర ఒక్కసారి పెరిగింది. రూ. 400 స్కిన్లెస్ ధర ఉంది. కొన్ని ప్రాంతాల్లో రూ. 350కు సైతం అంటున్నారు. లైవ్ రూ. 210కి అమ్ముతున్నారు. కోడిగుడ్ల ధర మాత్రం స్థిరంగా ఉంది. 30 గుడ్లు రూ.150కి అమ్ముతున్నారు. చికెన్ ధర ఒకసారి పెరగటంతో సామాన్యులకు ఆర్థిక భారంగా ఉంది. వేసవిలో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.

News March 29, 2026

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్..!

image

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ ప్రఖర్ జైన్ శనివారం తెలిపారు. ప్రధానంగా బూర్జ, హిరమండలంలో వడగాల్పులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండలు అధికంగా ఉన్నందున అత్యవసరం అయితే తప్ప బయట తిరగరాదని ప్రజలను హెచ్చరించారు.