News November 20, 2025

కామారెడ్డి: క్వారీ లీజులకు పర్యావరణ అనుమతి తప్పనిసరి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో కొత్త, రెన్యువల్ మైనింగ్, క్వారీ లీజుల మంజూరుకు రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ డ్రాఫ్ట్ నివేదికను kamareddy.telangana.gov.inలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. నివేదికపై అభ్యంతరాలు, అభిప్రాయాలు ఉన్నవారు ఈ నెల 21వ తేదీలోపు జిల్లా మైనింగ్ కార్యాలయానికి పంపాలని కలెక్టర్ వివరించారు.

Similar News

News March 11, 2026

రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ: PDPL కలెక్టర్

image

జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేశామని, నూతన రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. బుధవారం ఆయన రంగాపూర్ లో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంకా ఎవరైనా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే విచారించి జారీ చేస్తామని తెలిపారు. జిల్లాలో 6,80,000 మందికి ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తుందని తెలిపారు.

News March 11, 2026

నేను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుంది: ట్రంప్

image

ఇరాన్‌పై పోరు త్వరలోనే ముగుస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడి చేయడానికి అక్కడ ఇంకేమీ మిగల్లేదన్నారు. తాను అనుకున్నప్పుడు యుద్ధం ఆగుతుందని తెలిపారు. హార్ముజ్‌లో బాంబులు పెట్టాలని ఇరాన్ ప్రయత్నించిందని.. కానీ తాము 16 మైన్ బోట్లను ధ్వంసం చేసి ఆ ప్లాన్‌ను తిప్పికొట్టామన్నారు. కాగా అంతకుముందు ఇరాన్‌పై దాడులు మరో రెండు వారాలు కొనసాగించాలని అనుకుంటున్నట్లు ఇజ్రాయెల్, US అధికారులు తెలిపారు.

News March 11, 2026

1,245 మంది బాలికలకు HPV వ్యాక్సిన్ వేషం

image

క్యాన్సర్ నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం అన్ని PHC, పట్టణ, ప్రాంతీయ, కమ్యూనిటీ ఆసుపత్రులలో జరిగినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్‌ఛార్జ్ అధికారి డా.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 1,649 మంది 14 ఏళ్ల బాలికలను గుర్తించామన్నారు. అందులో నేడు 1,245 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశామన్నారు. వ్యాక్సిన్ అనంతరం వైద్యులు అమ్మాయిలకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారన్నారు.