News November 20, 2025
నంద్యాల జిల్లా అభివృద్ధికి సమన్వయం అవసరం: ఎంపీ శబరి

నంద్యాల జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నంద్యాల ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ & పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి, సీఈఓ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2026
గుంటూరులో కట్టుదిట్టమైన భద్రత

గుంటూరు జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గుంటూరు, పొన్నూరు, తెనాలి పత్తిపాడు, తాడికొండ, మంగళగిరి మసీదులు, ఈద్గాలు, ప్రార్థనా మందిరాల వద్ద అదనపు పోలీసు బలగాలు మోహరించి, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణతో పాటు అత్యవసర సేవల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
News March 21, 2026
యుద్ధం.. ఇరాన్కు లాభాలు!

యుద్ధం వల్ల ఇరాన్కు నష్టాలతో పాటు లాభాలూ కలుగుతున్నాయి. గత 40 ఏళ్లుగా క్రూడాయిల్ అమ్మకుండా ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పుడు ప్రపంచంలో ఆయిల్ సంక్షోభం తలెత్తడంతో అమెరికా దిగివచ్చి వాటిని ఎత్తివేసింది. ఆయిల్ అమ్ముకోవచ్చంది. ఇక హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే షిప్పులకు గతంలో ఎలాంటి ఫీజు లేకపోయేది. ఇప్పుడు ఇరాన్ ఒక్కో నౌకకు ఆయిల్ ట్యాంకర్ కంపెనీల నుంచి 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తోంది.
News March 21, 2026
‘ధురంధర్-2’పై దీపిక సైలెన్స్ ఎందుకు?

‘ధురంధర్-2’పై రణ్వీర్ భార్య, హీరోయిన్ దీపికా పదుకొణె స్పందించకపోవడంపై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. భర్త విజయాలను అభినందించడంలో ముందుండే ఆమె ఈసారి ప్రీమియర్లకూ దూరంగా ఉండటంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధురంధర్ ఫస్ట్ పార్ట్కు ఇన్స్టాలో ప్రశంసించిన దీపిక ఇప్పుడు SM సైలెన్స్ వెనక రీజన్ ఏంటా అని చర్చించుకుంటున్నారు. కాగా దీపిక ఇటీవల రణ్వీర్ తల్లి, సోదరితో ముంబైలోని ఓ కన్సర్ట్లో మెరిశారు.


