News November 20, 2025
TTD అధికారులకు సవాలే..!

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు జరగనుంది. గత దర్శనాల సమయంలో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందు 3రోజులు ఆన్లైన్ టోకెన్లు ఉన్నవారినే అనుమతించనుంది. తర్వాత 7రోజులు ఎవరైనా వెళ్లవచ్చు. ఇవేమీ తెలియకుండా కొండకు భారీగా వచ్చే భక్తులను అదుపు చేయడం TTD అధికారులకు పెద్ద సవాల్గా మారనుంది.
Similar News
News November 21, 2025
HNK: రేపు సమాచార కమిషనర్ అయోధ్య రెడ్డి రాక

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ అయోధ్య రెడ్డి శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే సమావేశానికి హాజరవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు హనుమకొండ కలెక్టరేట్ లో సమాచార హక్కు చట్టం అమలుపై అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం జిల్లాకు చెందిన రెవెన్యూ, మునిసిపల్ మొదలైన విభాగాల RTI చట్టం కింద దాఖలు చేయబడిన అప్పీళ్లు / ఫిర్యాదులపై విచారణలు నిర్వహిస్తారు.
News November 21, 2025
‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి’

స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేసి, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. HYD నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, DGP శివధర్ రెడ్డితో కలిసి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో పాటు HNK కలెక్టర్ స్నేహ శబరీష్ తదితరులు పాల్గొన్నారు.
News November 21, 2025
‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి’

స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేసి, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. HYD నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, DGP శివధర్ రెడ్డితో కలిసి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో పాటు HNK కలెక్టర్ స్నేహ శబరీష్ తదితరులు పాల్గొన్నారు.


