News April 15, 2024

మండపేటలో 1000 మందికి పైగా వాలంటీర్ల రాజీనామా

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈరోజు మండపేట నియోజకవర్గానికి చెందిన 1000 మందికి పైగా రాజీనామా చేశారు. వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు సమక్షంలో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వైసీపీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని వారు స్పష్టం చేశారు. తోట త్రిమూర్తులుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధించిందన్నారు.

Similar News

News October 7, 2025

దీపావళికి జాగ్రత్తలు పాటించండి: SP

image

దీపావళి పండగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా పేలుళ్లు జరగకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పోస్టర్ సిద్దం చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆ పోస్టర్‌ను SP నర్సింహ కిషోర్ ఆవిష్కరించారు. జిల్లా అంతటా దీపావళి మందు గుండు సామగ్రి స్టోరేజ్ గోడౌన్లు, అమ్మకాలు జరిగే ప్రదేశాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు.

News October 7, 2025

‘అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించాలి’

image

జిల్లాలో నేరాల అదుపునకు అనుమానిత ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించాలని SP నరసింహ కిషోర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి నేర గణాంకాలపై సమీక్షించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్, డీపీఓకు సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్, పెండింగ్ NBWS, NDPS కేసుల దర్యాప్తుపై సమీక్షించారు.

News October 7, 2025

రాజమండ్రిలో వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా

image

ప్రభుత్వ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ కీర్తి చేకూరి ఆరా తీశారు. మంగళవారం ఆమె రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. పలు వార్డులు, పరికరాలు, రికార్డులు పరిశీలించారు. మందుల నిల్వలు, పరిక్షల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలన్నారు. పారిశుద్ధ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.