News November 20, 2025
HYD: సౌదీలో మృతదేహాలకు రేపు అంత్యక్రియలు: అజహరుద్దీన్

సౌదీలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి రేపు అంత్యక్రియలు చేయనున్నట్లు మైనారిటీ శాఖ మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ మంత్రి అజహరుద్దీన్, ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సౌదీ అధికారులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా మృతుల కుటుంబసభ్యులు సైతం సౌదీకి చేరుకున్నారు.
Similar News
News March 22, 2026
కాఫీ ఇలా తాగితే ఆరోగ్యం పక్కా!

చాలామంది కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. కానీ ఫిల్టర్ చేసిన బ్లాక్ కాఫీ లివర్, గట్ హెల్త్కు చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. నిద్రలేచిన 60 నుంచి 90 నిమిషాల తర్వాత తాగడం బెస్ట్ టైమ్. రోజుకు 1-3 కప్పుల వరకు ఓకే. చక్కెర కలపకుండా తాగడం ముఖ్యం. అలాగే ఖాళీ కడుపుతో తాగొద్దు. ఆర్గానిక్ కాఫీ గింజలైతే బ్రెయిన్ షార్ప్గా ఉండటమే కాకుండా అల్జీమర్స్ వంటి రిస్కులు తగ్గుతాయి.
News March 22, 2026
పలాస: ప్రసవం తర్వాత బాలింత మృతి..!

పలాస CHCలో బాలింత మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పలాస(M) దానకొరకు చెందిన మీనా ప్రభుత్వాసుపత్రిలో ఉదయం 9 గం.కు రెండో బిడ్డకు జన్మనిచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంటకు మీనా మెలకువలోకి వచ్చింది. కాసేపటికే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. వైద్యలు వివిధ పరీక్షలు చేసి చికిత్స అందించినా రక్షించలేకపోయారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, కార్బొఎంబోలిజం కారణంగా మృతిచెందిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ పాపినాయుడు తెలిపారు.
News March 22, 2026
నేడే రైతు భరోసా నిధుల విడుదల

TG: రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. తొలి విడతలో ఒక ఎకరం భూమి వరకు రూ.6,000 చొప్పున మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ₹3,590 కోట్లు చేరనున్నాయి. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా ₹2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు జమ కానున్నాయి.


