News November 20, 2025
పాలకుర్తి సభను విజయవంతం చేయండి: TRP

ఈనెల 25న పాలకుర్తిలో జరిగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభను విజయవంతం చేయాలని జనగామ జిల్లా అధ్యక్షురాలు చెరుకూరి మౌనిక యాదవ్ కోరారు. జిల్లా కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 25న పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశానికి తీన్మార్ మల్లన్న హాజరవుతున్నారని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News March 21, 2026
హనుమకొండ జిల్లాలో పెరిగిన అటవీ విస్తీర్ణం

జిల్లాలో అటవీ విస్తీర్ణం పరిమితంగా ఉంది. సుమారు 4 వేల ఎకరాలు ఉండగా 0.20 శాతం విస్తీర్ణం పెరిగినట్లు అంచనా. జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లోని ఇనుపరాతి గుట్టల పరిధిలో అడవులు విస్తరించాయి. ముఖ్యంగా దేవనూరు అటవీ ప్రాంతంలో ఈ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, కుందేళ్లు తదితర వన్యప్రాణులు సంచరిస్తున్నాయి.
# నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.
News March 21, 2026
అమలాపురం: లభ్యం కానీ గల్లంతైన విద్యార్థి ఆచూకీ

అమలాపురం మండలంలోని ఓడలరేవు సముద్ర తీరంలో గల్లంతైన ఇంటర్ విద్యార్థి దొమ్మేటి లోకేశ్ ఆచూకీ కోసం శనివారం రెండో రోజూ గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అమలాపురం ప్రభాకర్ నగర్కు చెందిన నలుగురు విద్యార్థులు సరదాగా స్నానానికి వెళ్లగా, అలల ఉధృతికి అందరూ గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా, లోకేశ్ గల్లంతైన సంగతి తెలిసిందే. అధికారుల పర్యవేక్షణలో గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
News March 21, 2026
పుట్టపర్తి: పోలీసుల పటిష్ఠ బందోబస్తు

శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో పవిత్ర రంజాన్ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ప్రార్థన మందిరాలు, మసీదులు వద్ద సిబ్బందిని నియమించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత సాఫీగా అందరూ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.


