News November 20, 2025

అనకాపల్లి: డీఈవోలు, ఎంఈవోలు ఫిర్యాదుల స్వీకరణకు ఆదేవాలు

image

విద్యా సంబంధిత ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కరణకు రాష్ట్రంలోని DEOలు, MEOలు ప్రతిరోజూ నిర్నీత సమయం కేటాయించాలని AP స్టేట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు ఈనెల 19న ఉత్తర్వులు జారీచేశారని అనకాపల్లి DEO అప్పారావు గురువారం తెలిపారు. DEOలు రోజూ సా.5గం.ల నుంచి 6గం.ల వరకూ, MEOలు సా.4గం.ల నుంచి 5గంంటల వరకు వారి కార్యాలయాల్లో ప్రజలు, పేరెంట్స్, టీచర్స్‌కు అందుబాటులో వుండాలని ఆదేశాలున్నాయన్నారు.

Similar News

News November 20, 2025

MHBD: ‘స్కాలర్షిప్ నమోదు ప్రక్రియ పెంచాలి’

image

ఎస్సీ విద్యార్థుల ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 5 నుంచి 8వ తరగతి బాలబాలికలకు రూ.1000 నుంచి రూ.1500 వరకు, 9, 10 తరగతి విద్యార్థులకు రూ.3500 వరకు, ప్రైవేట్ హాస్టల్ విద్యార్థులకు రూ.7000 వరకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

News November 20, 2025

అరకు: కాఫీ బెర్రీ బోరర్ నివారణకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

కాఫీ తోటలను ఆశిస్తున్న బెర్రీ బోరర్ పురుగు వ్యాప్తి నివారణకు కలెక్టర్ దినేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్షికంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఈ పురుగు వ్యాప్తి బయటికి వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని గురువారం అరకు పర్యటనలో ఆదేశించారు. అరకు డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లో కాఫీ కొనుగోలు, అమ్మకాలకు నియంత్రణ విధించారు. ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు కాఫీ కొని అమ్మడాలను తాత్కాలికంగా నిషేధించారు.

News November 20, 2025

HYD: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పేట్ బషీరాబాద్‌లో నివాసం ఉండే కుమ్మరి ప్రణయ(29) భర్తతో గొడవల కారణంగా ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. రాత్రి ఇంట్లో గొడవల కారణంగా తీవ్ర మనస్తపానికి గురై తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈరోజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.