News November 20, 2025

TU: డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. 10838 విద్యార్థుల హాజరు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం ఉమ్మడి నిజామాబాద్ పరిధిలో గురువారం తొలి రోజు డిగ్రీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు 30 పరీక్ష కేంద్రాలలో 11519 మంది విద్యార్థులకు గాను 10838 మంది విద్యార్థులు హాజరు కాగా 681 మంది గైర్హాజరయ్యారు. ఉదయం డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, 6వ సెమిస్టర్ పరీక్షలు జరుగగా మధ్యాహ్నం మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయని వెల్లడించారు.

Similar News

News March 4, 2026

NZB: ఎవరి పరిధిలో వారు పని చేసుకోవాలి: కాంగ్రెస్

image

జిల్లా అధ్యక్షుడు, కార్పొరేషన్ DCC అధ్యక్షుల పదవులు రెండూ సమాన హోదా కలిగినవిగా పరిగణించాలని, ఎవరి పరిధిలో వారు పని చేసుకోవాలని అధిష్టానం సూచించినట్లు NZB కార్పొరేషన్ DCC అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ చెప్పారు. బుధవారం DCC కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 రోజుల పాటు కాంగ్రెస్ అధిష్టానం తమకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.

News March 4, 2026

ఏటూరునాగారం ట్రైబల్ కాలేజీలో పుడ్ పాయిజన్

image

ఏటూరునాగారంలోని ట్రైబల్ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. గత 3 రోజులుగా విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఆదివారం వండిన చికెన్ కారణంగా నాసిరకం, ఉడకని భోజనం వడ్డించగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధ్యులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్ డిమాండ్ చేశారు. ఐటీడీఏ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.

News March 4, 2026

భయం పుట్టించే B-2 తయారీలో ఇండో-అమెరికన్!

image

ప్రపంచంలో భయంకరమైన యుద్ధ ఆయుధాల్లో <<19277612>>B-2<<>> బాంబర్ టాప్‌లో ఉంటుంది. దీని తయారీలో భారత సంతతికి చెందిన నోషిర్ గొవాడియాది కీలకపాత్ర. 1944లో బాంబేలో జన్మించిన ఈయన USకు వెళ్లి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. నార్త్‌రోప్ గ్రుమ్మన్ కంపెనీలో డిజైన్ ఇంజినీర్‌గా చేరారు. B-2 బాంబర్లు శత్రువుల రాడార్లకు కనబడకుండా స్పెషల్ డిజైన్ చేశారు. చైనాకు దీని సమాచారం ఇచ్చారని US కోర్టు 2010లో 32 ఏళ్ల జైలుశిక్ష విధించింది.