News November 20, 2025
HYD: ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలా?: పద్మారావు గౌడ్

HYDలో ఫార్ములా-ఈ నిర్వహణ తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిందని మాజీ మంత్రి, సికింద్రాబాద్ MLA టి.పద్మారావు గౌడ్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. కేటీఆర్ విజన్తో సాధ్యమైన ఈ గొప్ప కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసూయతో తప్పుడు కేసులు పెట్టించడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వారి వైఖరిని బయట పెడుతోందని వ్యాఖ్యానించారు.
Similar News
News November 22, 2025
హుజురాబాద్లో దూరవిద్య తరగతులు ప్రారంభం

డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు దూర విద్యా తరగతులు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతున్నాయని హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. ఇందిరా దేవి, అధ్యయన కేంద్ర కోఆర్డినేటర్ కె.మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో ప్రవేశం పొందిన విద్యార్థులు ప్రతి ఆదివారం జరిగే తరగతులకు హాజరు కావాలన్నారు.
News November 22, 2025
కంచిలి: “సేవలను సద్వినియోగం చేసుకోవాలి”

కంచిలి మండలం ఎంఎస్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలను శనివారం రాష్ట్ర పీఎంశ్రీ పాఠశాలల సీనియర్ లెక్చలర్ పుల్లట రమేష్ సందర్శించారు. పీఎంశ్రీ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో రకాల నిధులు మంజూరు చేస్తుందని పుల్లట రమేష్ అన్నారు. ప్రతి ఒక్కరూ వీటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కంచిలి ఎంఈఓ-2 కుంబి చిట్టిబాబు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<


