News November 20, 2025
MHBD: ‘స్కాలర్షిప్ నమోదు ప్రక్రియ పెంచాలి’

ఎస్సీ విద్యార్థుల ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 5 నుంచి 8వ తరగతి బాలబాలికలకు రూ.1000 నుంచి రూ.1500 వరకు, 9, 10 తరగతి విద్యార్థులకు రూ.3500 వరకు, ప్రైవేట్ హాస్టల్ విద్యార్థులకు రూ.7000 వరకు స్కాలర్షిప్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News November 21, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్కు సామాన్యులకూ ఛాన్స్?

వచ్చేనెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబస్ సమ్మిట్ను ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సర్కారు భారీ ఏర్పాట్లు చేస్తోంది. 100 ఎకరాల్లో సదస్సు నిర్వహిస్తారు. వందలాది స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. 1,300 కంపెనీలు పాల్గొనే అవకాశముంది. ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమాన్ని 10, 11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చూసే సౌకర్యం కల్పించినట్లు సమాచారం.
News November 21, 2025
భువనేశ్వర్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

HYD నుంచి భువనేశ్వర్ వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్న్యూస్ తెలిపారు. డిసెంబర్ 2 నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ప్రతి మంగళవారం నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి భువనేశ్వర్(07165) ట్రైన్, అలాగే ప్రతి బుధవారం భువనేశ్వర్ నుంచి నాంపల్లి (07166) ట్రైన్ ప్రయాణికులకు సేవలందిస్తాయన్నారు. వచ్చేనెల 23 వరకు ఈ ప్రత్యేక రైలు ఉంటుందన్నారు.
News November 21, 2025
సాకే గంగమ్మ మృతిపై వైఎస్ జగన్ సంతాపం

మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తల్లి సాకే గంగమ్మ మృతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శైలజానాథ్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. సాకే గంగమ్మ ఇవాళ ఉదయం అనంతపురంలో తుదిశ్వాస విడిచారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, వైసీసీ నేతలు నివాళి అర్పించారు.


