News November 21, 2025

CRICKET UPDATES

image

* రేపటి నుంచి యాషెస్ సంగ్రామం.. ఉ.7.50 గంటలకు పెర్త్ వేదికగా ఆసీస్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం
* ట్రై సిరీస్‌లో శ్రీలంకకు షాక్ ఇచ్చిన జింబాబ్వే.. 163 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక 95 రన్స్‌కే కుప్పకూలిన లంక
* ఈ నెల 27న WPL వేలం.. తొలి సెట్లో వేలానికి రానున్న దీప్తి శర్మ, రేణుకా సింగ్
* వందో టెస్టులో సెంచరీ బాదిన బంగ్లా స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్.. ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా రికార్డ్

Similar News

News November 21, 2025

బరితెగించారు.. మోదీ-మైథిలీపై AI అసభ్యకర వీడియో

image

AI టెక్నాలజీతో క్రియేటర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా పీఎం మోదీ, బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించిన సింగర్ మైథిలి ఠాకూర్‌పై అసభ్యకర AI వీడియోను రూపొందించి SMలో పెట్టారు. దీన్ని బీజేపీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే ఆ వీడియోను తొలగించాలని, క్రియేట్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
NOTE: సెన్సిటివిటీ దృష్ట్యా వీడియోను పోస్ట్ చేయలేకపోతున్నాం.

News November 21, 2025

RTC బస్సులో ప్రయాణించిన సీఎం సతీమణి

image

AP: కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని CM చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొందారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆమె శాంతిపురం నుంచి తుమ్మిసి వరకు బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

News November 21, 2025

టాటా డిజిటల్‌లో భారీగా లేఆఫ్‌లు

image

టాటా గ్రూప్‌లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. TCSలో ఉద్యోగుల తొలగింపు తరువాత, ఇప్పుడు టాటా డిజిటల్‌‌లోనూ ఎంప్లాయీస్‌ను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. టాటా న్యూ పనితీరు గత రెండేళ్లుగా ఊహించిన స్థాయిలో లేదు. దీంతో కొత్త CEO సజిత్ శివానందన్‌ పునర్‌వ్యవస్థీకరణను ప్రారంభించారు. ఇందులో భాగంగా TATA NEUలోని 50% ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. అన్ని డిజిటల్ సేవలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు.