News April 15, 2024
మతాంతర వివాహంతో ట్రోల్స్.. చాలా ఇబ్బంది పడ్డా: ప్రియమణి
మతాంతర వివాహం చేసుకోవడం వల్ల సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నానని హీరోయిన్ ప్రియమణి తెలిపారు. దీనివల్ల తనతోపాటు పేరెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ‘మైదాన్’ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ‘ట్రోల్స్ విషయంలో భర్త నాకు అండగా నిలబడ్డాడు. ఏం జరిగినా చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. అలాంటి వ్యక్తి భర్తగా దొరకడం నా అదృష్టం’ అని పేర్కొన్నారు. ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్ను వివాహమాడారు.
Similar News
News October 12, 2024
చరిత్ర సృష్టించిన భారత్
ఉప్పల్ స్టేడియంలో టీమ్ ఇండియా రికార్డుల మోత మోగించింది.
*టెస్టు హోదా ఉన్న జట్టు టీ20ల్లో చేసిన అత్యధిక స్కోర్ ఇదే (297)
*టీ20ల్లో టీమ్ ఇండియాకు ఇదే హయ్యెస్ట్ స్కోర్ (297)
*భారత్ ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు (22)
*భారత టీమ్ తరఫున ఫాస్టెస్ట్ 100- 7.2 ఓవర్లలో
*భారత టీమ్ తరఫున ఫాస్టెస్ట్ 200- 13.6 ఓవర్లలో
News October 12, 2024
నాకు ఆ సమస్య ఉంది: ఆలియా భట్
తనకు ఆరోగ్యపరంగా ఉన్న సమస్య గురించి బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఓ పాడ్కాస్ట్లో వెల్లడించారు. ‘మా కూతురు రాహా ఫొటోను షేర్ చేయడంపై ఆసక్తి ఉండేది కాదు. తను ఇన్స్టాలో రీల్ కావడం నాకిష్టం లేదు. రాహాతో కలిసి ఫొటో దిగుదామని రణ్బీర్ అన్నప్పుడు కంగారుపడ్డా. ఎందుకంటే ప్రతి క్షణం నేను ఆందోళనకు గురవుతా. కొన్నిసార్లు అది తీవ్రంగా ఉంటుంది. రణ్బీర్ నా సమస్యను అర్థం చేసుకుని ప్రవర్తిస్తుంటాడు’ అని తెలిపారు.
News October 12, 2024
కశ్మీరీ పండిట్లకు ఫరూక్ అబ్దుల్లా కీలక వినతి
కశ్మీర్ వ్యాలీ నుంచి వలస వెళ్లిపోయిన పండిట్లు తిరిగి స్వస్థలాలకు రావాల్సిందిగా ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్ను శత్రువులా భావించవద్దని కోరారు. ‘వెళ్లిపోయిన వారు తిరిగి రావడానికి సమయం వచ్చేసింది. మేము కేవలం కశ్మీరీ పండిట్ల గురించే కాకుండా జమ్మూ ప్రజల గురించి కూడా ఆలోచిస్తాం. మనం అందరం భారతీయులం. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలి’ అని పేర్కొన్నారు.