News November 21, 2025
నాగార్జునసాగర్-శ్రీశైలం వెళ్తున్నారా?.. మీ కోసమే

నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతీ శనివారం సాగర్ జలాశయం నుంచి కృష్ణా నదిలో నల్లమల అటవీ అందాల నడుమ సాగే ఈ లాంచీ ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు వెల్లడించారు. లాంచీ ప్రయాణానికి సంబంధించిన టికెట్ ధరలను అధికారులు ప్రకటించారు. వన్ వే ప్రయాణం పెద్దలకు రూ.2 వేలు, 5 – 10 పిల్లలకు రూ.1600లుగా ధర నిర్ణయించారు.
Similar News
News November 22, 2025
SKLM: ఆర్టీసీ ఆధ్వర్యంలో పార్సిల్ సర్వీసులు బేష్

శ్రీకాకుళం జిల్లా RTC సంస్థ ఆధ్వర్యంలో పార్సిల్ సర్వీస్ సేవలు భేష్ అని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ పేర్కొన్నారు. సేవలందించిన రెండు ఏజెన్సీలు నిర్వాహకులను శనివారం స్థానిక కాంప్లెక్స్లో ఆయన అభినందించారు. ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ప్రజలకు సంబంధించిన వివిధ రకాల పార్సిల్లను ఎంత దూరమైన అందించే సేవలో ఆర్టీసీ పనిచేస్తుందన్నారు. DMలు నరసింహుడు, శర్మ, ఎంపీరావు పాల్గొన్నారు.
News November 22, 2025
డ్రగ్స్-టెర్రర్ లింక్ను నాశనం చేయాలి: మోదీ

డ్రగ్స్-ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసిరావాలని జీ20 సమ్మిట్లో PM మోదీ పిలుపునిచ్చారు. SAలోని జొహనెస్బర్గ్లో జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను సవాలుగా తీసుకోవాలన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఫెంటానిల్ వంటి వాటి వ్యాప్తిని అరికట్టడం, డ్రగ్స్-టెర్రర్ సంబంధాలను ఎదుర్కొనేందుకు సహకరించుకోవాలని ప్రతిపాదించారు. ఉగ్రవాద ఆర్థిక మూలాలను బలహీనపర్చేందుకు కృషి చేయాలన్నారు.
News November 22, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA తెలిపింది. ఇది సోమవారానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొంది. దీంతో రేపు ప్రకాశం, NLR, KDP, అన్నమయ్య, CTR, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. వరి కోతల టైం కావడంతో ధాన్యం కుప్పలు వేసుకోవాలని, రంగుమారకుండా ఉండేందుకు టార్పాలిన్లతో కప్పి ఉంచాలని రైతులకు సూచించింది.


