News November 21, 2025
నవంబర్ 23 నుంచి ఓపెన్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభం

డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం, నిజామాబాదులో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్తో పాటు, పీజీ (MBA) మొదటి సెమిస్టర్, పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి.
నవంబర్ 23 ఆదివారం ఉదయం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ డా.పి. రామ్మోహన్ రెడ్డి, సమన్వయకర్త డా. కె. రంజిత తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
Similar News
News November 22, 2025
SRHలోనే విధ్వంసకర బ్యాటర్లు

మినీ వేలం వేళ హిట్టర్లు ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ను SRH విడిచిపెట్టనుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ యాజమాన్యం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. తాజాగా ఈ విధ్వంసకర వీరులిద్దరి ఫొటోలను SRH ట్వీట్ చేసింది. టాప్ ఆర్డర్లో హెడ్, మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ ‘ఫైర్ పవర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్లోనూ వీరిద్దరూ ఊచకోత కోయాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News November 22, 2025
హనుమకొండ: ‘ఆర్టీఐ కమిషన్ వద్ద 18 వేల పెండింగ్ దరఖాస్తులు’

రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ వద్ద సుమారు 18 వేల సెకండ్ అప్పీల్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర సమాచార కమిషనర్ అయోధ్యరెడ్డి అన్నారు. నేడు జిల్లాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లుగా ఆర్టీఏ కమిషన్ లేదని, అందువల్ల పెండింగ్లు పెరిగిపోయాయని తెలిపారు. ఐదు నెలల కాలంలో సుమారు 5 వేలకు పైగా దరఖాస్తులు పరిష్కరించామని, రాష్ట్రంలోని 17జిల్లాల్లో జీరో పెండింగ్ ఉండే విధంగా చేశామన్నారు.
News November 22, 2025
హనుమకొండ: ‘ఆర్టీఐ కమిషన్ వద్ద 18 వేల పెండింగ్ దరఖాస్తులు’

రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ వద్ద సుమారు 18 వేల సెకండ్ అప్పీల్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర సమాచార కమిషనర్ అయోధ్యరెడ్డి అన్నారు. నేడు జిల్లాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లుగా ఆర్టీఏ కమిషన్ లేదని, అందువల్ల పెండింగ్లు పెరిగిపోయాయని తెలిపారు. ఐదు నెలల కాలంలో సుమారు 5 వేలకు పైగా దరఖాస్తులు పరిష్కరించామని, రాష్ట్రంలోని 17జిల్లాల్లో జీరో పెండింగ్ ఉండే విధంగా చేశామన్నారు.


