News November 21, 2025
RGM: జీవితంపై విరక్తి చెంది యువకుడి ఆత్మహత్య

GDK గౌతమీ నగర్కు చెందిన తిరువీధి శ్యాముల్ కిరణ్ (21) సమీపంలోని రైల్వే ట్రాక్ గూడ్స్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు NTPC SI ఉదయ్ కిరణ్ శుక్రవారం తెలిపారు. ITI చదువుతున్న అతడు చదువు మధ్యలో మానేయడంతో తల్లిదండ్రులు మందలించారు. జీవితంపై విరక్తిచెంది నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లి శుక్రవారం గౌతమీనగర్ ట్రాక్పై విగతజీవిగా పడి ఉన్నాడు. తండ్రి కొండలరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 22, 2025
శ్రీకాకుళం: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు

ట్రైనింగ్పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
News November 22, 2025
బాపట్ల: ‘భూ సమస్యలను జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలి’

భూ సమస్యలను అధికారులు జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల కలెక్టరేట్లో రెవిన్యూ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి భూ అర్జీని నిష్పక్షపాతంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. నిషేధిత భూములపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డిఆర్వో గంగాధర్ గౌడ్, ఆర్డీఓలు పాల్గొన్నారు.
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతానికి దివ్య ముహూర్తం నేడే..

శని దోష నివారణ కోసం చేసే 7 శనివారాల వ్రతాన్ని నేడు ప్రారంభించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ‘వ్రతాన్ని ఈరోజు మొదలుపెడితే వచ్చే ఏడాది JAN3 పౌర్ణమి రోజున పూర్తవుతుంది. పౌర్ణమి సంయోగం వల్ల అధిక ఫలితం ఉంటుంది. ఏడో వారానికి ముందు వైకుంఠ ఏకాదశి రావడం, వ్రత కాలంలో ధనుర్మాసం ఉండటం వల్ల శనిదేవుడు, విష్ణువు అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు’ అంటున్నారు. వ్రతం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


