News November 22, 2025

MDK: రూ.లక్ష ఆదాయం వస్తుంది..!

image

సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మల్బరీ తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పట్టుకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, రైతులు కొద్దిగా కష్టపడితే ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రభుత్వాలు అందిస్తోన్న ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వర్ రావు తెలిపారు.

Similar News

News November 23, 2025

ఆర్టీసీలో ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు: ఆది

image

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలు ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం వట్టెంలలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని అన్నారు. అవసరమైన వారికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు.

News November 23, 2025

పురుషార్థాలు సిద్ధింపజేసే విష్ణు శ్లోకం

image

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ||
విష్ణు సహస్ర నామాలు ముఖ్యమైనవి మాత్రమే కాదు. ఇవి అసాధారణమైనవి. ఎందరో రుషులు వీటిని గానం చేశారు. కీర్తించారు. అంతటి మహిమాన్విత నామాలను పఠించడం లేదా వినడం వల్ల పరమ ప్రయోజనాలు, పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇవి లోకానికి శుభాన్ని, భగవంతుని అనుగ్రహాన్ని చేకూర్చడానికి ఉపక్రమిస్తున్నాయి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 23, 2025

యథావిధిగా అమలాపురంలో ‘పీజీఆర్‌ఎస్‌’ : కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 24 సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో, అలాగే ఆర్డీవో కార్యాలయాలు, మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు.