News November 22, 2025
ఎంజీఎంలో అత్యవసర సేవలపై నిర్లక్ష్యం: ఎంపీ బలరాం

WGL కలెక్టరేట్లో జరిగిన దిశా సమావేశంలో MHBD ఎంపీ పోరిక బలరాంనాయక్ ఎంజీఎంలో రాత్రి వేళ అత్యవసర వైద్యసేవలలో నిర్లక్ష్యం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర కేసుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని, షిఫ్ట్ల వారీగా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డిని ఆదేశించారు. ఆస్పత్రి పరిశుభ్రత, పరికరాల కొరతపై చర్యలు తీసుకునేందుకు సీఎంతో చర్చిస్తామన్నారు.
Similar News
News November 22, 2025
వనపర్తి: ఉడెన్ షటిల్ కోర్ట్ ,జిమ్ ప్రారంభానికి సిద్ధం

వనపర్తి ఇండోర్ స్టేడియంలో సుమారు రూ.20 లక్షలతో నిర్మించిన వుడెన్ షటిల్ కోర్ట్, జిమ్ ఈరోజు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ప్రారంభించనున్నారు. రూ.12 లక్షలతో ఉడెన్కోట్ రూ.7 లక్షలతో జిమ్, సుమారు లక్షన్నరతో స్టేడియం డయాస్పై టాప్ నిర్మించేందుకు ప్రభుత్వం ఖర్చు చేసిందని సంబంధిత అధికారి తెలిపారు. క్రీడాకారులకు వ్యాయామ చేసేవారికి ఎంతో ఉపయోగమన్నారు.
News November 22, 2025
జల, వాయు మార్గాల ద్వారా భారత్-అఫ్గాన్ ట్రేడ్

భారత్-అఫ్గాన్ మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. పాక్ రోడ్డు మార్గం మూసేయడంతో జల, వాయు మార్గాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఇరాన్లోని చాబహార్ ఓడరేవుతోపాటు రెండు ప్రత్యేక కార్గో విమానాలను ఉపయోగించుకోనున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం IND-AFG మధ్య బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుండగా, భవిష్యత్తులో మరింత పెంచనున్నాయి.
News November 22, 2025
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జగిత్యాల విద్యార్థిని

ZPHS వెల్లుల్లలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలలో బి.శ్రీవర్షిణి జగిత్యాల జిల్లా తరఫున అత్యంత ప్రతిభ కనబరిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎంపికయింది. ఈ జట్టు రేపటి నుంచి 25వ తేదీ వరకు యాదాద్రి భువనగిరిలో జరగబోయే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొననుంది. శ్రీవర్షిణి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయులు రాజయ్య, ఉపాధ్యాయ బృందం ఆనందం వ్యక్తం చేసింది.


