News November 22, 2025

వరంగల్ సెంట్రల్ జైలు నిర్మాణం ఎప్పుడు..?

image

నిజాం కాలం నాటి WGL సెంట్రల్ జైలు 2021లో కూల్చగా, మామునూరులో కొత్త జైలు నిర్మిస్తామని ప్రకటించినా నాలుగున్నరేళ్లుగా పనులు మొదలుకాలేదు. వెయ్యి మంది ఖైదీలను ఇతర జైళ్లకు మార్చడంతో వారి కుటుంబాలు కలుసుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారు.101 ఎకరాలు కేటాయించినా బడ్జెట్ లేక పనులు నిలిచాయి. ప్రస్తుతం మామునూరులో 20 మంది ఖైదీలకు 40 మంది సిబ్బంది పని చేస్తుండగా, కొత్త జైలు నిర్మాణంపై ప్రభుత్వం స్పందించడం లేదు.

Similar News

News November 23, 2025

జగిత్యాలలో ప్రశాంతంగా ఎస్‌ఎంఎంఎస్ పరీక్షలు

image

జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆదివారం మొత్తం ఆరు పరీక్షా కేంద్రాల్లో ఎస్‌ఎంఎంఎస్ (SMMS) పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు అర్హులైన 1,474 మంది విద్యార్థుల్లో 1,416 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా, ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు ఆయన పేర్కొన్నారు.

News November 23, 2025

SRSPకి భారీగా తగ్గిపోయిన ఇన్ ఫ్లో

image

SRSPలోకి ఇన్ ఫ్లో భారీగా తగ్గిపోయింది. గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 1,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం తెలిపారు. సరస్వతీ కెనాల్‌కు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు వదిలామన్నారు. కాగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80.501 TMCల నీరు నిల్వ ఉందన్నారు.

News November 23, 2025

సాయి బోధనలతో జీవితంలో ప్రశాంతత: VVS లక్ష్మణ్

image

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ బాబాను స్మరించుకున్నారు. ప్రేమ, సేవ, కరుణతో కూడిన బాబా సందేశం తమకు నిరంతరం మార్గదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆ మహనీయుని ఆశీస్సులు, స్ఫూర్తి ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని లక్ష్మణ్ ఆకాంక్షించారు.