News November 22, 2025
ములుగు: నేడు డీజీపీ ఎదుట లొంగిపోనున్న కీలక నేతలు

తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంకు చెందిన కొయ్యడ సాంబయ్య@ఆజాద్, డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాజీ నారాయణ, కంకణాల రాజిరెడ్డితో పాటు 20 మంది కేడర్ లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట వీరంతా లొంగిపోనున్నారు.
Similar News
News November 25, 2025
తిరుమల శ్రీవారి సారెలో ఏముంటాయంటే?

పంచమి తీర్థం సందర్భంగా తిరుమల ఆలయం నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సారె ఇస్తారు. 2పట్టు చీరలు, రవికలు, పసుపు ముద్ద, శ్రీగంధం కర్ర, పచ్చని పసుపు కొమ్ముల చెట్లు, పూలమాలలు, తులసీ మాల, బంగారు హారం, ఒకే పడి(51) పెద్ద లడ్డూలు, ఒకే పడి(51) వడలు, ఒకే పడి(51) అప్పాలు, ఒకే పడి (51) దోసెలు ఉంటాయి. ముందుగా స్వామివారికి సమర్పించి ఊరేగింపుగా అలిపిరికి.. అక్కడి నుంచి ఏనుగుపై తిరుచానూరుకు తీసుకెళ్తారు.
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<


