News November 22, 2025

NGKL: తుఫాన్ ఎఫెక్ట్ తగ్గిన చలి తీవ్రత

image

ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ వల్ల వర్షాలు కురుస్తుండటంతో నాగర్‌కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత తగ్గింది. గడచిన 24 గంటలలో జిల్లా వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. కల్వకుర్తిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 18.4 డిగ్రీలు నమోదయింది. చారకొండ, అమ్రాబాద్‌లో 18.9, వెల్దండలో 19.2, తాడూరులో 19.3, తెలకపల్లిలో 19.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

Similar News

News November 25, 2025

విషతుల్యమవుతున్న తల్లిపాలు

image

తల్లిపాలు స్వచ్ఛమైనవి, కల్తీలేనివని మనం అనుకుంటాం. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తల్లి పాలల్లో మైక్రోప్లాస్టిక్ అవశేషాలున్నట్లు గతంలో పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే తాజాగా బిహార్‌లో చేసిన ఓ పరిశోధనలో తల్లిపాలలో యురేనియం అవశేషాలున్నట్లు గుర్తించారు. ఇవన్నీ ఇలాగే కొనసాగితే మానవ మనుగడే కష్టం అంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా మేలుకొని పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

News November 25, 2025

భూపాలపల్లి: పంచాయతీ ఎన్నికలపై పార్టీల ఫోకస్!

image

జిల్లాలో 248 పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరుగుతున్నప్పటికీ, తమ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందేలా ప్రధాన పార్టీల నాయకులు దృష్టి సారించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పంచాయతీ పోరును పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సర్పంచ్ అభ్యర్థులపై నియోజకవర్గ స్థాయి నాయకులు ఆరా తీస్తున్నారు.

News November 25, 2025

ఇవాళ ఉదయం 10 గంటలకు

image

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల కోటా(రూ.300)ను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను రిలీజ్ చేయనుంది. టికెట్ల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని TTD తెలిపింది. దళారులను నమ్మి మోసపోవద్దని, నకిలీ వెబ్ సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.