News April 16, 2024
కర్నూలు: 399 మంది వాలంటీర్ల రాజీనామా

కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 339 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని జెడ్పీ సీఈఓ నాసర రెడ్డి తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు 264 మంది రాజీనామా చేయగా.. 15న ఒక్కరోజే 135 మంది రాజీనామా చేశారన్నారు. సంబంధిత ఎంపీడీఓలు వారి రాజీనామాలను ఆమోదించారన్నారు. 15న రాజీనామా చేసిన వారిలో కోసిగి మండలంలో 46, కల్లూరు 38, మద్దికెర 3, తుగ్గలి 21, ఆదోని 16. కౌతాళం మండలంలో 11 మంది ఉన్నారని సీఈఓ తెలిపారు.
Similar News
News September 30, 2025
కల్లూరు: కారు ఢీకొని 33 గొర్రెలు, కాపరి మృతి

కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు గ్రామానికి చెందిన కురువ ఎల్ల రాముడు (33) కారు ఢీకొని మృతి చెందాడు. ఉలిందకొండ నేషనల్ హైవేలో గొర్రెలను రోడ్డు దాటిస్తుండగా కర్నూల్ నుంచి వేగంగా వస్తున్న కారు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. 33 గొర్రెలతో సహా కాపరి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి నలుగురు ఆడపిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
News September 30, 2025
జోగుళాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ ఏపీ తరఫున జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి జోగుళాంబా సమేత శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, కలెక్టర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
News September 30, 2025
కర్నూలు జిల్లా పీఈటీకి అరుదైన అవకాశం

కర్నూలు జిల్లా నందవరం జడ్పీ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు సూరజ్కు అరుదైన అవకాశం లభించింది. ఆంధ్ర రాష్ట్ర బాలుర ఫుట్బాల్ జట్టు కోచ్గా ఆయనను నియమించారు. శ్రీనగర్లో అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే అండర్-19 జాతీయ స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొనే ఆంధ్ర రాష్ట్ర బాలుర జట్టుకు ఆయన శిక్షణ ఇవ్వనున్నారు.