News November 22, 2025
నిర్మల్ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

నిర్మల్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు నడుపనున్నట్లు డిపో అధికారులు తెలిపారు. డిసెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు నిర్మల్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీలో తిరుపతి, కాణిపాకం దేవస్థానాలు కూడా దర్శించుకోవచ్చు. ఒక్కొక్కరికి చార్జి రూ.6,300 గా నిర్ణయించారు. ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. వివరాల కోసం 9959226003, 8328021517, 7382842582 నంబర్లలో సంప్రదించండి.
Similar News
News November 25, 2025
తిరుమల శ్రీవారి సారెలో ఏముంటాయంటే?

పంచమి తీర్థం సందర్భంగా తిరుమల ఆలయం నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సారె ఇస్తారు. 2పట్టు చీరలు, రవికలు, పసుపు ముద్ద, శ్రీగంధం కర్ర, పచ్చని పసుపు కొమ్ముల చెట్లు, పూలమాలలు, తులసీ మాల, బంగారు హారం, ఒకే పడి(51) పెద్ద లడ్డూలు, ఒకే పడి(51) వడలు, ఒకే పడి(51) అప్పాలు, ఒకే పడి (51) దోసెలు ఉంటాయి. ముందుగా స్వామివారికి సమర్పించి ఊరేగింపుగా అలిపిరికి.. అక్కడి నుంచి ఏనుగుపై తిరుచానూరుకు తీసుకెళ్తారు.
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<


