News November 22, 2025
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అబ్జర్వర్గా నవీన్ కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ పంతంగిలో జరగబోయే అండర్ – 17 బాలబాలికల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను పర్యవేక్షించడానికి జడ్.పి.హెచ్.ఎస్ భూషణరావుపేట ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వీ. నవీన్ కుమార్ను రాష్ట్ర ఎస్ జీ ఎఫ్ క్రీడల అధికారిని ఉషా రాణి నియమించారు. ఈ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ వారు అభినందించారు.
Similar News
News November 24, 2025
కొత్తగూడెం: ‘పోలీస్ వాహనాలు కండిషన్లో ఉంచాలి’

పోలీస్ వాహనాల డ్రైవర్లు తమ వాహనాలను ఎల్లప్పుడూ మంచి కండీషన్లో ఉంచుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. హెడ్ క్వార్టర్స్లో పోలీసు వాహనాలను సోమవారం ఎస్పీ తనిఖీ చేశారు. జిల్లాలోని పోలీస్ డ్రైవర్స్ సమస్యలు, డ్యూటీలో భాగంగా వారి పనితీరును గురించి ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని వాహనాలను కండిషన్లో ఉంచాలని సూచించారు.
News November 24, 2025
మంచిర్యాల: దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం సంబంధిత అధికారులతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. పాత మంచిర్యాలకు చెందిన లచ్చయ్య వేంపల్లి శివారులోని పట్టా భూమిలో ఇబ్బందికరంగా ఏర్పాటుచేసిన విద్యుత్తు స్తంభాలను మరోచోటికి మార్చాలని కోరారు.
News November 24, 2025
ఇళ్లు లేనివారు ఈనెల 30లోగా ఇలా చేయండి: కర్నూలు కలెక్టర్

PMAY–2 గ్రామీణ్ కింద అర్హతకలిగి, ఇల్లులేని గ్రామీణ ప్రజలు నవంబర్ 30లోపు తమపేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామాల్లో ఇంటి స్థలం ఉన్నా– లేకపోయినా సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు. ఇల్లు మంజూరు అయ్యేవారికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందజేస్తుందని పేర్కొన్నారు. గడువు తర్వాత నమోదు అవకాశంలేదని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.


