News November 23, 2025

ADB నుంచి ముగ్గురు DCCలు

image

కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షులను నియమిస్తు శనివారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ADB, నిర్మల్, ASF జిల్లాల DCC అధ్యక్షులు ఒకే జిల్లా వాసులు కావడం విశేషం. నరేశ్ జాదవ్ గుడిహత్నూర్ మండలం, ఆత్రం సుగుణ, వెడ్మ బొజ్జు పటేల్‌ది ఉట్నూర్‌ మండలం. ఒకే జిల్లాకు చెందిన ముగ్గురు ST విభాగం నేతలకు పదవులు రావడంతో జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 24, 2025

కడప: గల్లంతైన ఇద్దరు యువకులు మృతి

image

కడప శివారులోని వాటర్ గండి పెన్నా నదిలో ఆదివారం ముగ్గురు <<18370606>>గల్లంతైన <<>>విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు చనిపోయారు. కడపకు చెందిన ఐదుగురు స్నేహితులు రీల్స్ కోసం అక్కడికి వెళ్లారు. ఈక్రమంలో ముగ్గురు నీటిలో కొట్టుకెళ్లారు. ఒకరిని అక్కడి వాళ్లు కాపాడారు. కె.నరేష్(18), పి.రోహిత్ కుమార్(16) సుడిగుండాల్లో చిక్కుకుని గల్లంతు అయ్యారు. ఇవాళ ఉదయం ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీశారు.

News November 24, 2025

మహిళా సంఘాల విజయ గాథలు ‘అవని’: కలెక్టర్

image

మెప్మా మహిళా సంఘాలు సాధించిన విజయగాధలు ‘అవని’ సంచికలో మనమందరం చదవి స్ఫూర్తి పొందవచ్చని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మెప్మా వార్షిక సంచిక ‘అవని’ కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళ పారిశ్రామిక విప్లవానికి గట్టి పునాదులు పడుతున్నాయన్నారు. మెప్మా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, కొత్త అవకాశాలను చూపిస్తూ ముందుకు సాగాలన్నారు.

News November 24, 2025

సీఎం చదువుకున్న పాఠశాల, కళాశాల అభివృద్ధికి రూ.50 కోట్లు: ఎమ్మెల్యే

image

సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న పాఠశాల, కళాశాలను రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.50 కోట్లతో నూతన భవనాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మించబోయే కొత్త ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం వనపర్తిలో ఉన్న చారిత్రక రాజభవనం నిర్మాణ శైలిని పోలి ఉంటుందన్నారు. రాబోయే సంవత్సరకాలంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.