News April 16, 2024
కర్నూలు: ఈనెల 19, 20వ తేదీల్లో షర్మిల పర్యటన
‘ఏపీ న్యాయ యాత్ర’లో భాగంగా ఈనెల 19, 20వ తేదీల్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కే.బాబురావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 19న అలూరు, ఆదోని, కోసిగిలో, 20న కోడుమూరు, కర్నూలులో పర్యటించనున్నట్లు చెప్పారు. ఈ యాత్రను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News September 30, 2024
దసరాకు 758 ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా APSRTC కడప జోన్ పరిధిలోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 758 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు అన్నారు.
News September 30, 2024
దసరాకు 758 ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా APSRTC కడప జోన్ పరిధిలోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 758 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు అన్నారు.
News September 30, 2024
కర్నూలు జిల్లాలో టమాటా ధర అదరహో
టమాటా రైతులకు కాసుల పంట పండుతోంది. కర్నూలు జిల్లాలో కిలో రూ.70 వరకు పలుకుతోంది. రైతుబజార్లలో కిలో రూ.30 నుంచి ₹44గా ఉంది. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 600 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. 25 కిలోల బాక్స్ ₹1400 వరకు పలుకుతోంది. పత్తికొండ, డోన్, ప్యాపిలి, ఆస్పరి, దేవనకొండ, క్రిష్ణగిరి, హొళగుంద, మద్దికెర, పెద్దకడబూరు, కల్లూరు తదితర మండలాల్లో ఈ పంటను సాగు చేశారు. జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో సాగులో ఉంది.