News November 23, 2025
తిరుపతి: తెలుగు, సంస్కృతానికి పెద్దపీట వేసేనా..?

తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ 2022లో ఏర్పాటైంది. రాష్ట్ర విభజన తరువాత తిరుపతిలోనే రాష్ట్ర కార్యాలయం ఉన్నా పరిపాలన మాత్రం విజయవాడ నుంచి సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛైర్మన్గా విల్సన్ తొలిసారి తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయ అభివృద్ధికి పెద్దపీట వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News November 23, 2025
HYD: వీకెండ్ డ్రంక్& డ్రైవ్లో 468 మంది దొరికారు

సైబరాబాద్లో వీకెండ్ డ్రంక్& డ్రైవ్లో 468 మంది పట్టుబడ్డారు. వాహనాల వారీగా 335 టూవీలర్లు, 25 ఆటోలు, 107 కార్లు, 1 హెవీ వెహికల్ సీజ్ చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగితే BNS సెక్షన్ 105 కింద 10 ఏళ్ల జైలు శిక్ష వర్తిస్తుందని పోలీసులు హెచ్చరించారు. గత వారం 681 కేసులు డిస్పోజ్ కాగా.. 613 మందికి ఫైన్, 50 మందికి ఫైన్+ సర్వీస్, 18 మందికి ఫైన్+ జైలు శిక్ష విధించారు.
News November 23, 2025
ఎడారిగా మారిన గుంపుల మానేరు వాగు

ఓదెల మండలం గుంపుల గ్రామంలో మానేరు నదిపై ఉన్న చెక్ డ్యాం కూలిపోవడంతో నది ఎడారిని తలపిస్తోంది. కార్తీక మాసం నవంబర్ 5న వేల సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చిన మానేరు, కేవలం 15 రోజుల్లోనే నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. దీంతో రైతులు, శ్రీ రామభద్ర ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే చొరవ తీసుకుని చెక్ డ్యాంను పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
News November 23, 2025
వికారాబాద్లో కాంగ్రెస్ కీలక నేత రాజీనామా.?

వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ధారసింగ్ ఐ కమాండ్ నియమించిన విషయం తెలిసిందే. అయితే వికారాబాద్ కీలక నేత అసంతృప్తి చెందారు. అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఓ ముఖ్యమైన నాయకుడు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అతను పార్టీ మారితే వికారాబాద్ పరిస్థితి ఏమవుతుందో అని భారీగానే చర్చలు వినిపిస్తున్నాయి. పార్టీ పెద్దల నుంచి బుజ్జగింపుల నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.


