News November 23, 2025

బీసీసీఐ ట్రోఫీకి సిద్దిపేట యువకుడు

image

బీసీసీఐ నిర్వహించే సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 ట్రోఫీ హెచ్‌సీఏ టీమ్‌లోకి సిద్దిపేటకు చెందిన క్రీడాకారుడు అర్ఫాజ్ అహ్మద్ ఎంపికయ్యారు. నవంబర్ 26 నుంచి కోల్‌కతాలో జరిగే ఈ టోర్నమెంట్‌లో అహ్మద్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కలకుంట్ల మల్లికార్జున్ హర్షం వ్యక్తం చేస్తూ అర్ఫాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 24, 2025

కెప్టెన్ దీపకకు మడకశిర ఎమ్మెల్యే అభినందన

image

శ్రీలంకలో జరిగిన అంధ మహిళల తొలి టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా నేపాల్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టికి చెందిన దీపిక వ్యవహరించారు. వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన దీపికను మడకశిర ఎమ్మెల్యే రాజు అభినందించారు. దీపిక సారథ్యంలో భారత్ తొలిసారిగా ఈ కప్‌ను గెలుచుకుందని సంతోషం వ్యక్తం చేశారు.

News November 24, 2025

వంటింటి చిట్కాలు

image

* కేక్ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ కలిపితే కేక్ ఎక్కువకాలం తాజాగా ఉంటుంది.
* పూరీలు మృదువుగా రావాలంటే పిండిని పాలతో కలపాలి.
* కూరల్లో గ్రేవీ చిక్కగా రావాలంటే అందులో కొంచెం కొబ్బరి పాలు లేదా పెరుగు కలపాలి.
* దుంపలు ఉడికించిన నీటితో వెండి పట్టీలు శుభ్రం చేస్తే తళతలా మెరుస్తాయి.
* కాలీఫ్లవర్‌ కూరలో టేబుల్ స్పూన్ పాలు కలిపితే కూర రుచిగా ఉంటుంది.

News November 24, 2025

6GHz స్పెక్ట్రమ్‌ వివాదం.. టెలికం vs టెక్ దిగ్గజాలు

image

6GHz బ్యాండ్‌ కేటాయింపుపై రిలయన్స్‌ జియో, VI, ఎయిర్‌టెల్‌కి వ్యతిరేకంగా అమెరికన్‌ టెక్‌ దిగ్గజాలు ఏకం అయ్యాయి. మొత్తం 1200 MHz‌ను మొబైల్‌ సేవల కోసం వేలానికి పెట్టాలని జియో కోరగా Apple, Amazon, Meta, Cisco, HP, Intel సంస్థలు ఈ బ్యాండ్‌ మొబైల్‌ సేవలకు సాంకేతికంగా సిద్ధంగా లేదని పేర్కొన్నాయి. పూర్తిగా వైఫై కోసం మాత్రమే ఉంచాలని TRAIకి సూచించాయి.