News April 16, 2024
రామయ్య కళ్యాణానికి వైభవంగా ముస్తాబైన మిథిలా స్టేడియం

భద్రాద్రిలో సీతారాముల కళ్యాణానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు కళ్యాణానికి మిథిలా స్టేడియం వైభవంగా ముస్తాబైంది. ఇప్పటికే శ్రీరామ నామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి. అటు పోలీస్ శాఖ 2 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తుంది. ఇరు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు భద్రాద్రి చేరుకుంటున్నారు.
Similar News
News April 21, 2025
CMRF స్కాం వెనుక RMPలదే ప్రధాన హస్తమా..?

ఖమ్మంలో CMRF స్కాం కలకలం రేపుతుంది. చికిత్స చేయకుండానే నకిలీ బిల్లులు సృష్టించి CMRF నిధులను దుర్వినియోగం చేసిన 10 ఆసుపత్రులను మూసివేసినట్లు DMHO వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో RMPలదే ప్రధానహస్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణకు సిద్ధం అవుతుంది. అలాగే ఖమ్మంలోని మరికొన్ని ఆసుపత్రులపై కూడా నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
News April 21, 2025
ఖమ్మం:ఓపెన్ పరీక్షలు..139గైర్హాజర్

ఖమ్మం జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పదో తరగతి పరీక్షలకు 488 మందికి గాను 420 మంది హాజరు కాగా 68 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షకు 646 మందికి గాను 575 మంది హాజరు కాగా, 71మంది గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖర శర్మ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.
News April 21, 2025
కొత్తగూడెం: యువతికి వేధింపులు.. కేసు నమోదు

యువతిని వేధింపులకు గురిచేసిన యువకుడిపై కేసు నమోదైంది. వైరా విప్పలమడుగుకి చెందిన రాహుల్ కొత్తగూడెంకు చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ యువతి రాహుల్ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఇచ్చేసింది. అయితే డబ్బు పూర్తిగా ఇవ్వలేదని.. దానికి బదులుగా తనతో శారీరకంగా దగ్గర కావాలని వేధిస్తున్నాడు. యువతి పోలీసులను ఆశ్రయించగా కేసు నమెాదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడెం సీఐ కరుణాకర్ తెలిపారు.