News November 24, 2025
యథావిధిగా జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్: కలెక్టర్

జిల్లావ్యాప్తంగా సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్తో పాటు మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో ఉదయం 10 గం: నుంచి అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు నేరుగా కార్యాలయాలకు రాలేని పక్షంలో https://meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, 1100 నంబర్ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చన్నారు.
Similar News
News November 24, 2025
118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
నేడు GWMC కార్యాలయంలో ప్రజావాణి

నగర ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు GWMC ప్రధాన కార్యాలయంలో ప్రతీవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం కౌన్సిల్ హాల్లో జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ప్రకటించారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హాజరై తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు.
News November 24, 2025
సంగారెడ్డి డీసీసీ ఎవరికి దక్కేనో..?

కాంగ్రెస్ అధిష్ఠానం అన్ని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించినప్పటికీ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి నియామకం పెండింగ్లో ఉంచడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ముగ్గురు కీలక నేతలు పోటీలో ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఉజ్వల్ రెడ్డి నారాయణ, ఖేడ్కు చెందిన నగేష్ షెట్కార్, ఖేడ్ MLA సంజీవరెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి డీసీసీ పీఠం పోటీలో ఉన్నట్లు టాక్.


