News April 16, 2024
రేపు మ.12 గంటలకు అయోధ్యలో అద్భుతం
శ్రీరామ నవమి సందర్భంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో అరుదైన ఘట్టం జరగనుంది. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతం కానుంది. 75MM వ్యాసార్ధంతో దాదాపు 6 నిమిషాలపాటు సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News October 13, 2024
ప్రపంచంలోనే ఇండియన్ ఫుడ్ బెస్ట్
ప్రపంచంలోనే (జీ20 దేశాలు) భారతీయ ఆహారం అత్యుత్తమం అని స్విట్జర్లాండ్కు చెందిన WWF లివింగ్ ప్లానెట్ రిపోర్టు-2024 వెల్లడించింది. ఇండియన్లు ఎక్కువగా మొక్కల నుంచి వచ్చే ఆహారం తీసుకుంటారని, అప్పుడప్పుడు మాంసాహారం తీసుకోవడం వల్ల సుస్థిర ఆహార వినియోగాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. US, ఆస్ట్రేలియా, అర్జెంటీనా ఫుడ్ అత్యంత చెత్త ర్యాంకింగ్ నమోదు చేసిందని పేర్కొంది.
News October 13, 2024
జైలులో నాటకం.. సీతను వెతుకుతూ ఖైదీల పరార్
ఉత్తరాఖండ్లోని రోషనాబాద్ జైలులో నాటకమాడుతూ ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. దసరా సందర్భంగా జైలులో రామాయణం నాటకం వేశారు. ఇందులో భాగంగా వానర పాత్రధారులు పంకజ్, రాజ్ కుమార్.. సీతను వెతికే క్రమంలో 22 అడుగుల జైలు గోడపై నుంచి పోలీసులు, తోటి ఖైదీలు చూస్తుండగానే దూకి పరారయ్యారు. పంకజ్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు, రాజ్ కుమార్ కిడ్నాప్ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
News October 13, 2024
మాజీ మంత్రి హత్య.. సీఎం రాజీనామాకు విపక్షాల డిమాండ్
మహారాష్ట్రలో మాజీ మంత్రి, NCP నేత బాబా సిద్దిఖీ దారుణ <<14343654>>హత్యకు<<>> గురికావడం సంచలనం రేపింది. దీనికి సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడణవీస్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని NCP(SP), శివసేన(UBT) డిమాండ్ చేశాయి. Y కేటగిరీ భద్రత కలిగిన రాజకీయ నేతనే కాపాడలేని ఈ ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలను ఏం కాపాడుతుందని ప్రశ్నించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తాయి.