News November 24, 2025

మహబూబాబాద్: బీసీ సర్పంచ్ అభ్యర్థులకు నిరాశే!

image

జిల్లాలోని తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్లోని 18 మండలాలకు RDO కార్యాలయంలో ఆర్డీవోలు సర్పంచ్ రిజర్వేషన్లను ఆదివారం ఖరారు చేశారు. జిల్లాలో 18 మండలాలకు గాను గూడూరు, కురవి, ఇనుగుర్తి, సిరోలు, బయ్యారం, డోర్నకల్, కొత్తగూడ, గార్ల, గంగారం, మరిపెడ 10 మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా బీసీ రిజర్వేషన్‌కు కేటాయించలేదు. దీంతో బీసీ సర్పంచ్ ఆశావహ అభ్యర్థులకు తీవ్ర నిరాశే మిగిలింది.

Similar News

News November 24, 2025

కొత్తగూడెం: ‘పోలీస్ వాహనాలు కండిషన్‌లో ఉంచాలి’

image

పోలీస్ వాహనాల డ్రైవర్లు తమ వాహనాలను ఎల్లప్పుడూ మంచి కండీషన్‌లో ఉంచుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు వాహనాలను సోమవారం ఎస్పీ తనిఖీ చేశారు. జిల్లాలోని పోలీస్ డ్రైవర్స్ సమస్యలు, డ్యూటీలో భాగంగా వారి పనితీరును గురించి ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని వాహనాలను కండిషన్‌లో ఉంచాలని సూచించారు.

News November 24, 2025

మంచిర్యాల: దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

image

ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం సంబంధిత అధికారులతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. పాత మంచిర్యాలకు చెందిన లచ్చయ్య వేంపల్లి శివారులోని పట్టా భూమిలో ఇబ్బందికరంగా ఏర్పాటుచేసిన విద్యుత్తు స్తంభాలను మరోచోటికి మార్చాలని కోరారు.

News November 24, 2025

ఇళ్లు లేనివారు ఈనెల 30లోగా ఇలా చేయండి: కర్నూలు కలెక్టర్

image

PMAY–2 గ్రామీణ్ కింద అర్హతకలిగి, ఇల్లులేని గ్రామీణ ప్రజలు నవంబర్‌ 30లోపు తమపేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామాల్లో ఇంటి స్థలం ఉన్నా– లేకపోయినా సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు. ఇల్లు మంజూరు అయ్యేవారికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందజేస్తుందని పేర్కొన్నారు. గడువు తర్వాత నమోదు అవకాశంలేదని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.