News April 16, 2024

మేం చేసిన అభివృద్ధి ఇదే: సీఎం జగన్

image

AP: తాము 58 నెలల కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశామని సీఎం జగన్ చెప్పారు. ‘కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశాం. 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు, 11 వేల ఆర్బీకేలు, 3వేల డిజిటల్ లైబ్రరీలు నిర్మించాం. నాడు నేడుతో స్కూళ్లు, హాస్పిటళ్ల రూపురేఖలు మార్చాం’ అని తెలిపారు.

Similar News

News October 13, 2024

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

సాధారణంగా దసరా రోజు తెలంగాణలో నాన్‌వెజ్ వంటకాలే చేస్తారు. అయితే నిన్న శనివారం కావడంతో ఎక్కువశాతం మంది వెజ్‌కే పరిమితమయ్యారు. ఇవాళ ఆదివారం కావడంతో చికెన్, మటన్ కోసం మార్కెట్లకు క్యూ కడుతున్నారు. దీంతో HYDతో పాటు APలోని విజయవాడ సహా ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లలో రద్దీ కనిపిస్తోంది. అయితే 2 రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్కిన్‌లెస్ కేజీ రూ.240-260 మధ్య పలుకుతోంది.

News October 13, 2024

టీతోపాటు సిగరెట్ తాగుతున్నారా?

image

చాలా మంది టీ తాగుతూ సిగరెట్ కాలుస్తుంటారు. కానీ దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో క్యాన్సర్, నపుంసకత్వం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవి శరీరంలో జీర్ణ కణాలనూ దెబ్బ తీస్తాయి. దీంతో అజీర్తి, మలబద్దకం, అల్సర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ అలవాటు మానలేకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.

News October 13, 2024

వీరిలో పర్మినెంట్ వికెట్ కీపర్ ఎవరో?

image

ప్రస్తుతం టీమ్ ఇండియాలో వికెట్ కీపర్ స్థానానికి విపరీతమైన కాంపిటీషన్ ఉంది. టీ20ల్లో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యంగా నలుగురు పోటీ పడుతున్నారు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రేసులో ఉన్నారు. నిన్న బంగ్లాతో జరిగిన చివరి టీ20లో విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో శాంసన్ ఈ రేసులో మరింత ముందుకు దూసుకొచ్చారు. ఈ నలుగురిలో మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి.