News April 16, 2024

అన్నమయ్య: 120 కేంద్రాల్లో స్లాష్ పరీక్షలు

image

అన్నమయ్య జిల్లాలో స్లాష్ 2024 పరీక్షలు 120 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని డీసీఈబీ సెక్రటరీ కె నాగమునిరెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లాకు కేటాయించిన అన్ని కేంద్రాలలో స్లాష్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏ కేంద్రానికి మినహాయింపు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News September 6, 2025

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వైవీయూకు ఉన్నత స్థానం: వీసీ

image

బోధన పరిశోధన సేవ అనే దృక్పథంతో ఏర్పాటైన వైవీయూ అనతి కాలంలోనే అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలతో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కీర్తిని అందుకుందని వైవీయూ వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు వెల్లడించారు. తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐ‌ఆర్‌ఎఫ్) 2025లో వైవీయూ 51 నుంచి 100 లోపు ర్యాంకు లభించిందన్నారు.

News September 6, 2025

కడప జిల్లా వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి

image

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల పరిదిలోని బాగాదుపల్లె వినాయక చవితి ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. గత శుక్రవారం వినాయక చవితి సందర్భంగా ఊరేగింపు సమయంలో ప్రమాదవశాత్తు టపాసులు పేలి కుమ్మితి పాలకొండయ్య (35)కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108లో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

News September 5, 2025

పులివెందులకు బై ఎలక్షన్ ఖాయం: రఘురామ

image

మాజీ సీఎం జగన్‌పై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చందమామ కోసం మారాం చేసినట్లుగా జగన్ ప్రతిపక్ష హోదా కోసం తాపత్రయపడుతున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. ఎమ్మెల్యేలు శాసనసభా సమావేశాలను బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్లుగా భావించాలి. అసెంబ్లీ ఉపసభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నా.’ అని తెలిపారు.