News April 17, 2024
UPSCలో 703 ర్యాంకు సాధించిన మరో ఆదిలాబాద్ వాసి

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ చెందిన ముకుంద్ రావు-గీత దంపతుల కుమారుడు చౌహన్ రాజ్ కుమార్ సివిల్స్ ఫలితాల్లో అలిండియా 703వ ర్యాంకు సాధించాడు. ఈయన కాగజ్నగర్ నవోదయలో పదోతరగతి పూర్తిచేసి, వరంగల్ NITలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఆదిలాబాద్ రురల్ మండలంలోని చందా(టి) గ్రామానికి చెందిన విశాల్ 718ర్యాంకు, ఇంద్రవెల్లి మండలం ముత్నూరుకు చెందిన శుభం 790 ర్యాంకు సాధించారు.
Similar News
News September 10, 2025
ఆదిలాబాద్: INTERలో చేరేందుకు మరో అవకాశం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేందుకు మరొకసారి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని ఆదిలాబాద్ డీఐఈఓ జాధవ్ గణేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో ఇంకా ఎవరైనా ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో చేరాలనుకుంటే ఈనెల 11, 12 తేదీల్లో అడ్మిషన్ పొందాలని సూచించారు. అలాగే లాంగ్వేజ్ మార్పు చేసుకునేందుకు కూడా ఈ రెండు రోజులే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 10, 2025
గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల

ADB జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారి చేసింది. ఎన్నికల అధికారిగా జిల్లా సహకార అధికారి, జాయింట్ రిజిస్టర్ మోహన్ను నియమించారు. మొత్తం 12 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగనుండగా… ఈనెల 12న నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ జరగనుంది. 17న పోలింగ్తో పాటు ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
News September 10, 2025
నార్నూర్ కేజీబీవీని సందర్శించిన సబ్ కలెక్టర్

నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ బుధవారం సందర్శించారు. ఈ పాఠశాలలో ఉదయం విద్యార్థినుల భోజనంలో పురుగులు ఉన్నాయని ఆరోపణలు రాగా ఆయన ఈ ఘటనపై ఆరా తీశారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయనతో పాటు విద్యాధికారి పవార్ అనిత, తహశీల్దార్ రాజలింగం తదితరులు ఉన్నారు.