News April 17, 2024
ప్రకాశం: ఎలుకల మందు తిని యువకుడు మృతి

ఎలుకల మందు తిని యువకుడు మృతిచెందిన ఘటన కొత్తపట్నం మండలం రంగాయపాలెం పంచాయతీ క్రాంతినగర్లో మంగళవారం జరిగింది. SI సాంబశివరావు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి కల్యాణ్ (39) చేపల వేటతో జీవనం సాగిస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పు చేసి తీర్చలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది ఎలుకలు మందు తిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
Similar News
News October 8, 2025
ప్రకాశం: ‘రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి’

రెవెన్యూ అంశాల ప్రజా సేవల పనితీరుపట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి మంగళవారం జిల్లా కలెక్టర్లకు సూచించారు. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి అన్నదాత సుఖీభవ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి కలెక్టర్ రాజాబాబు హాజరై జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని వివరించారు.
News October 8, 2025
పొదిలి: షాప్లోకి దూసుకెళ్లిన కారు.!

పొదిలి పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కారులో ఓవర్ స్పీడ్తో వచ్చి క్లోజ్ చేసిన హోటల్లోకి దూసుకెళ్లాడు. ఆ సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News October 7, 2025
3 గంటల్లో వర్షం.. ప్రకాశం జిల్లాకు ఎల్లో అలర్ట్.!

ప్రకాశం జిల్లాకు రానున్న మూడు గంటల్లో తేలికపాటి వర్ష సూచనతోపాటు, పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, ప్రకాశం జిల్లాకు మాత్రం ఎల్లో అలర్ట్ ప్రకటిస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. చెట్లకింద ఉండరాదని, తగిన జాగ్రత్తలు వహించాలని ప్రజలకు సూచించారు.