News April 17, 2024

VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

విజయనగరంలోని ఎత్తు వంతెన సమీపంలో ట్రావెల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గంట్యాడ మండలానికి చెందిన ఎస్ చిమ్మనాయుడు (43) విజయనగరంలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, విశాఖ వైపు వెళ్తున్న బస్సు వంతెన వద్ద ఢీకొంది. ప్రమాదంలో చిమ్మనాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News January 20, 2026

‘అర్హులందరికీ ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పింఛన్లు వర్తింపజేయాలి’

image

జిల్లాలో అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులకు సంబంధించిన ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పథకాలను అర్హులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే ఆ పథకాలకు జిల్లాలో 9,300 దరఖాస్తులు వచ్చాయని సోమవారం తెలిపారు. మార్చిలోగా 15 వేల మందికి మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.

News January 20, 2026

VZM: 26 నుంచి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన స్పెషల్ డ్రైవ్

image

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఈ నెల 26 నుంచి మార్చి 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం సూచించారు. ఇందుకోసం జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు కూడా భాగస్వాములుగా పనిచేయాలన్నారు. హోటళ్లు, దుకాణాలు, వ్యవసాయ రంగాల్లో బాల కార్మికులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.

News January 19, 2026

ఫిబ్రవరి 1-45 రోజులు ‘సమ్మర్ క్రాష్’: కలెక్టర్

image

జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ఫిబ్రవరి 1-45 రోజులు ‘సమ్మర్ క్రాష్’ కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. చేతి పంపులు, నీటి పథకాలను తనిఖీ చేసి చెడిపోయిన వాటిని 48 గంటల్లో మరమ్మతులు చేయాలన్నారు. నీటి కొరత గ్రామాల్లో బోర్ల లోతు పెంచడం, అవసరమైతే ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ట్యాంకర్ల‌తో నీటిని సరఫరా చేయాలన్నారు.