News April 17, 2024

విశాఖ: సివిల్స్‌‌లో మెరిసిన హనిత ..887 ర్యాంక్

image

యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో విశాఖకి చెందిన వేములపాటి హనిత 887 ర్యాంకుతో మెరిశారు. గతేడాది గ్రూప్-1లో రాణించి వైద్యారోగ్యశాఖలో కొలువు సాధించిన ఈమె ఏడాది తిరక్కుండానే సివిల్స్‌లో సత్తాచాటారు. మూడు ప్రయత్నాల్లో మెయిన్స్ వరకు వచ్చి ఆగిపోయిన హనిత నాలుగో ప్రయత్నంలో విజయం సాధించి తన కలను నెరవేర్చుకున్నారు.

Similar News

News October 8, 2025

విశాఖ అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ తీర్మానించింది: గంటా

image

విశాఖలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని వైకాపా తన ఉత్తరాంధ్ర సమావేశంలో తీర్మానం చేసిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. గతంలో తాము జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు దర్శి, సత్తెనపల్లి వంటి అనేక ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చామని గుర్తుచేశారు. కానీ వైకాపా మాత్రం విశాఖ అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు.

News October 8, 2025

ఎల్ఆర్ఎస్‌ పథకం కోసం VMRDA గ్రౌండ్ ఫ్లోర్లో హెల్ప్ డెస్క్

image

ఎల్ఆర్ఎస్ పథకం కోసం VMRDA గ్రౌండ్ ఫ్లోర్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది జూన్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ పథకం కింద తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చని అన్నారు. దీనివల్ల భవన నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు.

News October 7, 2025

‘ఉపాధి హామీ వేతనదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలి’

image

ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఈ-కేవైసీ చేస్తున్నామని డ్వామా పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. NMMS యాప్‌లో ముఖ ఆధారిత హాజరు నమోదుకు దీన్ని చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు పనికి రాకుండా ముఖ ఆధారిత హాజరు పద్ధతి ప్రారంభం కానుందని అన్నారు. జిల్లాలో 47,725 మందికి ఈ-కేవైసీ జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు, జాబ్ కార్డులతో క్షేత్ర సహాయకుడిని సంప్రదించాలని కోరారు. ‌