News November 26, 2025
22A భూములపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి: మంత్రి నాదెండ్ల

22A కింద నమోదైన జిరాయితీ భూముల యజమానులు భూములు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. పొరపాటుగా నమోదైన భూములను 22A జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, దీనిని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు.
Similar News
News November 27, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: పత్తి అమ్మకంలో రైతుల ఇక్కట్లు
> బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద నిరసన
> ఎన్నికల నిబంధనలపై అందరికీ ఆవాహన ఉండాలి
> జనగామ: బీఆర్ఎస్ సమావేశానికి కేటీఆర్ హాజరు
> స్టేషన్ ఘనపూర్లో తొలగించని ఫ్లెక్సీలు
> నర్మెట్ట: కొమురవెల్లి దేవస్థానం ఛైర్మన్గా గంగం నరసింహ రెడ్డి
> పంచాయతీ ఎన్నికలకు పకడ్బంది ఏర్పాట్లు చేయాలి: ఎన్నికల కమిషనర్
News November 27, 2025
హైడ్రాపై కర్ణాటక బృందం ప్రశంసలు

TG: హైడ్రా (HYDRAA) చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించిన కర్ణాటక ప్రతినిధులు ఈ మోడల్ను బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా పేర్కొన్నారు. బతుకమ్మకుంట, నల్లచెరువు వంటి పునరుద్ధరించిన చెరువులను పరిశీలించారు. ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణలో హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశంసించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో జరిగిన చర్చలో దీని అమలు విధానం, విభాగాల సమన్వయం గురించి తెలుసుకున్నారు.
News November 27, 2025
జనగాం: ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఎన్నికల విధులను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలపై అధికారులకు శిక్షణ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జెడ్పీ సీఈఓ మధురిషా తదితరులు పాల్గొన్నారు.


