News November 26, 2025

రైతులకు నష్టం లేకుండా ప్రభుత్వం చర్యలు: కలెక్టర్

image

ధాన్యం పంట కోత సమయంలో రైతులకు నష్టం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో 74 రైస్ మిల్లులు ఉండగా, యజమానులంతా బ్యాంకు పూచికతలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉందన్నారు. రెండు లక్షల టన్నుల ధాన్యం సేకరణ నేపథ్యంలో రూ.200 కోట్లు పూచికతలు రైస్ మిల్లుల నుంచి రావాలన్నారు. ప్రతి మిల్లులో తేమ యంత్రాలు విధిగా ఉండాలన్నారు. అధికారులు చిత్తశుద్ధితో సరిగ్గా పని చేయాలన్నారు.

Similar News

News November 28, 2025

జపాన్ కామెంట్స్ ఎఫెక్ట్.. ఫ్రాన్స్ మద్దతుకు ప్రయత్నిస్తున్న చైనా

image

జపాన్‌తో వివాదం ముదురుతున్న వేళ ఫ్రాన్స్ మద్దతు కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మద్దతుగా నిలబడాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దౌత్య సలహాదారుతో చైనా దౌత్యవేత్త వాంగ్ ఇ చెప్పారు. ‘వన్-చైనా’ విధానానికి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించడానికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వచ్చే వారం చైనా వస్తున్నారు.

News November 28, 2025

హైదరాబాదీలు వీకెండ్ ప్లాన్ చేశారా..?

image

నగరవాసులు ఆహ్లాదకరమైన వాతావరణంలో వీకెండ్ చిల్ అయ్యేందుకు మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్‌ పార్క్‌లో TGFDC ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈనెల 29న సా.5 నుంచి 30న ఉ.10 గంటల వరకు నేచర్ క్యాంప్‌ నిర్వహించనున్నారు. ఇందులో టెంట్‌ పిచింగ్, టీమ్‌ బిల్డింగ్, నైట్‌ క్యాంపింగ్ ఫారెస్ట్ వాక్ వంటివి ఉంటాయి. ఇందులో అరుదైన పక్షిజాతులను చూడొచ్చు. ఆసక్తిగలవారు 73823 07476, 94935 49399లో సంప్రదించండి.

News November 28, 2025

HYD: రోలెక్స్ వాచీ కాజేసిన కానిస్టేబుల్

image

నకిలీ IPS శశికాంత్‌ను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు షేక్ పేటలోని అపర్ణ ఔరా అపార్ట్ మెంట్‌కు వెళ్లి తాళం తీసి వీడియోగ్రఫీ మధ్య సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులతో ఉన్న ఓ కానిస్టేబుల్ కళ్లు నిందితుడి వార్డ్ రోబ్‌లో ఉన్న రోలెక్స్ వాచ్‌పై పడింది. వీడియోకు చిక్కకుండా వాచీని చేజిక్కించుకోగలిగినా మరో కానిస్టేబుల్ కంట పడ్డాడు. దీంతో అతడు మరికొన్ని వస్తువులు కాజేశాడు.