News November 27, 2025
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన కీలక సమావేశం

అమరావతి అసెంబ్లీలో శాసనమండలి సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. కమిటీ ఛైర్మన్, మండపేటకు చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర నూతన ఎక్సైజ్ విధానంపై ప్రధానంగా చర్చించారు. 2024-26 పాలసీలో భాగంగా 3,736 ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతులు, వ్యాపార నియంత్రణ తదితర కీలక అంశాలపై ఎక్సైజ్ శాఖ అధికారులతో కమిటీ సమీక్షించింది.
Similar News
News November 28, 2025
HYD: విశిష్ట రంగస్థల పురస్కారం గ్రహీత.. ప్రొఫైల్ ఇదే!

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావుకు 2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం వరించింది. 2001లో K2 నాటికకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు, 2020లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా, తెలుగులో ‘ప్రతాప రుద్రమ’ నాటకానికి దర్శకత్వం వహించిన తొలి తెలుగువాడిగా ఘనత సాధించారు. ఆధునిక తెలుగు నాటకరంగంలో జాతీయ, అంతర్జాతీయ వేదికలల్లో ఎన్నో ప్రదర్శనలు చేసి సందర్శించారు.
News November 28, 2025
SUలో 14 ఏళ్ల తర్వాత తెలుగు PHDకి పర్మిషన్

శాతవాహన వర్సిటీలో 14 ఏళ్ల తర్వాత తెలుగు పీహెచ్డీకి అనుమతి లభించింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ వీసీ ప్రొ.ఉమేష్ కుమార్ను జేఏసీ ఛైర్మన్ చెన్నమల్ల చైతన్య, తెలుగు విభాగం ఆచార్యులు, విద్యార్థులు గజమాలతో ఘనంగా సత్కరించారు. నెట్, సెట్ సాధించిన విద్యార్థులకు ఇది గొప్ప అవకాశమని చైతన్య పేర్కొనగా, వర్సిటీ అభివృద్ధే తన లక్ష్యమని వీసీ తెలిపారు. కార్యక్రమంలో డా.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
News November 28, 2025
RR: నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు

గ్రామపంచాయతీ ఎన్నిక నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు ఇవే..
– నామినేషన్ పత్రాలను నిర్దిష్ట సమయంలో దాఖలు చేయకపోవడం
– నిర్దేశించిన చోట అభ్యర్థులు, ప్రతిపాదించే వారు సంతకాలు చేయకపోవడం
– ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే
– ఆస్తులు,అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా పొందుపర్చకపోవడం
– చట్ట ప్రకారం అవసరమైన డిపాజిట్ నగదును చెల్లించకపోవడం ప్రధాన అంశాలు.


