News November 27, 2025
BREAKING: వికారాబాద్ జిల్లాలో భూకంపం!

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్లలో భూకంపం వచ్చింది. గురువారం సాయంకాల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ఇళ్లల్లోని వస్తువులు కదిలాయని, గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. గ్రామస్థులు ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి చేరుకొని వివరాలను ఆరా తీస్తున్నారు.
Similar News
News November 28, 2025
HYD: విలీనానికి ముందు.. అసలు లెక్క తేలాలిగా?

జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీన ప్రక్రియ సంపూర్ణం కావాలంటే చాలా లెక్కలు తేలాల్సి ఉంది. ఆయా మున్సిపాలిటీల ఆస్తులు, అప్పులు, ఆదాయవ్యయాలు, కరెంటు, వాటర్ బిల్లులు, పెండింగ్ బిల్లులు, భూముల వివరాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ తేలాలి. ముఖ్యంగా వివాద భూముల లెక్కలు తేలాలి. ఇక ఆస్తి పన్నులు ఎన్నున్నాయి. ఎంత రావాలి అనేది కూడా క్లియర్గా ఉండాలి. అంతేకాక ఉద్యోగుల వివరాలు.. ఇవన్నీ జీహెచ్ఎంసీకి సమర్పించాలి.
News November 28, 2025
HYD: విలీనానికి ముందు.. అసలు లెక్క తేలాలిగా?

జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీన ప్రక్రియ సంపూర్ణం కావాలంటే చాలా లెక్కలు తేలాల్సి ఉంది. ఆయా మున్సిపాలిటీల ఆస్తులు, అప్పులు, ఆదాయవ్యయాలు, కరెంటు, వాటర్ బిల్లులు, పెండింగ్ బిల్లులు, భూముల వివరాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ తేలాలి. ముఖ్యంగా వివాద భూముల లెక్కలు తేలాలి. ఇక ఆస్తి పన్నులు ఎన్నున్నాయి. ఎంత రావాలి అనేది కూడా క్లియర్గా ఉండాలి. అంతేకాక ఉద్యోగుల వివరాలు.. ఇవన్నీ జీహెచ్ఎంసీకి సమర్పించాలి.
News November 28, 2025
జగిత్యాల: ‘పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ఆర్వోలకు, ఏఆర్వోలకు శుక్రవారం నిర్వహించిన ఫేజ్ 2 శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నామినేషన్లు చాలా ముఖ్యమైన అంశమని, దీనిపై చాలా కేసులు అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశం నిబంధన ప్రకారం జరిగేలా చూడాలన్నారు.


