News April 17, 2024
పుంగనూరులో ఉద్రిక్తత

పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్త హేమాద్రిని వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జానపద కళల అకాడమీ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం ఇంటి వద్దకు వారు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వైసీపీ, టీడీపీ నాయకులను వెళ్లగొట్టారు. పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News October 8, 2025
పడిపోయిన అరటి ధరలు.. నష్టాల్లో రైతులు

అరటి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో SRపురం, పలమనేరు, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల్లో రైతులు విరివిగా అరటి పంటను సాగు చేశారు. ధరలు లేకపోవడంతో పలువురు రైతులు పంటను తోటలోని వదిలేస్తున్నారు. రూ.లక్షల్లో పంట నష్టం వాటిల్లుతోందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు.
News October 8, 2025
చిత్తూరు: రైతులకు విరివిగా రుణాలు

ప్రభుత్వ ఆదేశాలతో రబీ సీజన్ రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని లీడ్ బ్యాంకు మేనేజర్ హరీష్ వివిధ బ్యాంకులను ఆదేశించారు. రబీ సీజన్లో 3,479 కోట్ల వరకు రైతులకు రుణాలు ఇస్తామన్నారు. జిల్లాలో 3.20 లక్షలు మంది రైతులు రుణాలు పొందవచ్చని సూచించారు. అనుబంధ రంగాలకు అదనంగా మరో రూ.16.3 కోట్లు రుణాలు మంజూరు చేస్తామన్నారు.
News October 8, 2025
చిత్తూరు: పోలీస్ కస్టడీకి పూర్వ ఆర్డీవో

మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో మరో కదలిక వచ్చింది. పూర్వ ఆర్డీవో మురళిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మురళికి ఇచ్చిన మద్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ఆయనను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును ఆశ్రయించింది.