News November 28, 2025
తిరుపతి: ఆయన వచ్చాక మారాయి.!

టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎంగా సుబ్రహ్మణ్యం వచ్చాక నెయ్యిలో అనేక నిబంధనలు వచ్చాయి. ఇక టెండర్ దక్కించుకున్న వారి సంస్థ పరిశీలన సమయంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని సిట్ గుర్తించినట్లు సమాచారం. కల్తీ నెయ్యి కేసులో సుబ్రహ్మణ్యం కీలకమని తెలుస్తోంది.
Similar News
News November 28, 2025
SU MBA, MCA పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో జరుగనున్న MBA, MCA విభాగంలో 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా DEC 5 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో DEC 9 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
News November 28, 2025
ఏలూరు: సివిల్స్ మెయిన్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల పొడిగింపు

ఏలూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు విజయవాడలో ఉచిత సివిల్స్ మెయిన్స్ శిక్షణకు దరఖాస్తులు డిసెంబర్ 7వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నాగరాణి గురువారం తెలిపారు. డిసెంబర్ 7న రాజమండ్రిలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 14వ తేదీ నుంచి అర్హులకు ఉచిత వసతి, శిక్షణ ఇస్తారని ఆమె పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు నం. 9030211920 సంప్రదించాలన్నారు.
News November 28, 2025
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ప్రకాశం కలెక్టర్

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చెప్పారు. గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు వచ్చిన పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ రాజాబాబు వివరించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉందన్నారు.


