News April 17, 2024

కావలి: ఐదుగురి మరణానికి కారణం అదే..!

image

నిన్న కావలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జలదంకి(M) చామదల SC కాలనీకి చెందిన శ్రీనివాసులు HYDలో పనిచేస్తున్నారు. శ్రీరాముల కళ్యాణం జరిపించడానికి సొంతూరికి వచ్చారు. భార్య వరమ్మ, సోదరి లక్ష్మమ్మ, ఆమె కోడలు నీలిమ, మనవడు నందు(2)తో కలిసి కారులో కావలికి బయలుదేరారు. జలదంకి మీదుగా దగ్గరైనా.. రోడ్డు గుంతలమయంగా ఉండటంతో బిట్రగుంట మీదుగా వచ్చారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అందరూ చనిపోయారు.

Similar News

News January 12, 2026

ముత్తుకూరులో మోసం.. రూ.80 లక్షలతో మహిళ పరార్

image

ముత్తుకూరు మండలంలో భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన అన్నపూర్ణమ్మ అనే మహిళ పొదుపు లీడర్‌గా చీటీలు వేయిస్తుంటారు. ఆమె సుమారు రూ.80 లక్షలతో పరారైనట్లు బాధితులు ఫిర్యాదు ఆరోపించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదికలో వినతులు స్వీకరించిన ఎస్పీ డా.అజిత వేజెండ్ల నిందితురాలి ఆచూకిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News January 12, 2026

ఊర్లకు వెళ్లేవారు LHMS యాప్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

image

సంక్రాంతి పండుగను ప్రజలు సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల కోరారు. ఊర్లకు వెళ్లేవారు ఇళ్ల భద్రత కోసం LHMS యాప్‌ను వాడాలని సూచించారు. రహదారులపై రద్దీ దృష్ట్యా తనిఖీలు పెంచామన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలని తల్లిదండ్రులను హెచ్చరించారు. సంప్రదాయం పేరుతో కోడిపందేలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News January 12, 2026

నెల్లూరు: రూ.1.20 కోట్ల విలువైన లగ్జరీ కార్లు స్వాధీనం

image

అంతర్రాష్ట్ర కార్ల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిందితులు ఇతర రాష్ట్రాల్లో లగ్జరీ కార్లను దొంగిలించి, నకిలీ నంబర్ ప్లేట్లు, డూప్లికేట్ పత్రాలతో విక్రయిస్తున్నారు. వారిని దర్గామిట్ట పోలీసులు అన్నమయ్య సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. రూ.1.20 కోట్ల విలువైన 2 కార్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.