News November 28, 2025
సికిల్సెల్, తలసేమియా రోగుల కోసం ప్రత్యేక శిబిరాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్సెల్, తలసేమియా దీర్ఘకాలిక రక్త వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరాలను ఈ నెల 29న (శనివారం) ఉదయం 8 గంటలకు అశ్వారావుపేటలో, మధ్యాహ్నం 12:30 గంటలకు నారాయణపురంలోని రైతు వేదికల్లో నిర్వహించనున్నారు.. రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
Similar News
News November 28, 2025
వర్ని: సర్పంచ్ ఎలక్షన్స్.. రెండు చోట్ల ఏకగ్రీవ తీర్మానం

నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ తండా, చెలక తండా గ్రామపంచాయతీల సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కొక్కరే నామినేషన్ వేయాలని స్థానికులు తీర్మానం చేశారు. గ్రామాల అభివృద్ధికి, ఐక్యతకు నిదర్శనంగా ఏకగ్రీవంగా ఎన్నికలు చేసుకోవాలని తీర్మానించారు. సిద్దాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా బాల్సింగ్, చెలక తండా సర్పంచ్ అభ్యర్థిగా గంగారాం మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు.
News November 28, 2025
NTR: న్యాయం కోసం వస్తే.. అసభ్య ప్రవర్తన

విజయవాడకు చెందిన న్యాయవాదిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన గిరిజన మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ఓ న్యాయవాది వద్దకు వచ్చి తన బాధ చెప్పుకుంటుండగా ఆయన సదరు మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించడంతో విసుగు చెందిన మహిళ మాచవరం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయగా ఎస్సై శంకరరావు కేసు నమోదు చేశారు.
News November 28, 2025
HYD: తెలుగు వర్సిటీ..”SPTU-B” ఘన విజయం

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో సౌత్ జోన్ ఎంపికలలో భాగంగా నిర్వహించిన T20 మ్యాచ్లో ‘SPTU-A’ జట్టుపై ‘SPTU-B’ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన SPTU-B జట్టు 20 ఓవర్లలో 195/7 పరుగులు చేయగా.. వాసు 52 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. SPTU-A 17.2 ఓవర్లకే 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గెలుపొందిన జట్టుకు వీసీ, రిజిస్ట్రార్ అభినందనలు తెలిపారు.


